• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది’

W.G: పోడూరు మండలం పెనుమదంలో రూ.4 కోట్ల 49 లక్షలతో పలు 17 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంటూ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మేలుచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

April 10, 2026 / 07:56 AM IST

రెండు నెలలకోసారి జిల్లాకు వస్తా: పవన్ కళ్యాణ్

KKD: ప్రతి రెండు నెలలకు ఒక సారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా పరిధిలోని ఏ ఒక్క రోడ్డుపై గుంతలు ఉండకూడదని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.

April 10, 2026 / 07:45 AM IST

కొవ్వూరు డంపింగ్ యార్డులో మంటలు

E:G: కొవ్వూరులో పాత రైల్వే బ్రిడ్జి సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న డంపింగ్ యార్డులో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెత్తకు తరచూ నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ కార్మికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

April 10, 2026 / 07:42 AM IST

నగర సుందరీకరణే లక్ష్యం: కేంద్ర మంత్రి

శ్రీకాకుళం నగర సుందరీకరణే లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన గురువారం సాయంత్రం శ్రీకాకుళంలో పర్యటించారు. సీఎం చంద్రబాబు సంకల్పించిన ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ లక్ష్య సాధనలో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

April 10, 2026 / 07:35 AM IST

వాహన తనిఖీలు.. 227 కేసులు నమోదు

KDP: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565ల జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

April 10, 2026 / 07:31 AM IST

సోలార్ ప్యానెల్స్‌ను ప్రారంభించిన మంత్రి

BPT: అద్దంకి మండలం వేలమూరిపాడులో సోలార్ ప్యానెల్స్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గంలో 6 వేల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల విలువైన యూనిట్లు అందించనున్నారు. రైతులకు కూడా ‘పీఎం కుసుమ్ పథకం’ ద్వారా త్వరలో 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని మంత్రి తెలిపారు. బీసీలకు రూ.98 వేలు, ఓసీలకు రూ.78 వేలు సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు.

April 10, 2026 / 07:30 AM IST

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన రామకుప్పం కుర్రాడు

CTR: రామకుప్పం (M) వీర్నమలకు చెందిన జ్యోతి-శివలింగం దంపతుల కుమారుడు నవీన్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అద్భుత విజయాన్ని సాధించాడు. నేపాల్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో నవీన్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. దీంతో పలువురు అతన్ని అభినందించారు.

April 10, 2026 / 07:16 AM IST

నేడు జిల్లాలో డయల్ యువర్ DM కార్యక్రమం

NLR: ఆత్మకూరు RTC డిపో పరిధిలోని పలు సమస్యలపై శుక్రవారం డయల్ యువర్ DM నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు డిపో మేనేజర్ ఎం.శివకేష్ యాదవ్ తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆత్మకూరు డిపో అభివృద్ధి కోసం ప్రయాణికుల సూచనలు, ఇతర సమస్యలపై 99592 25645 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

April 10, 2026 / 07:15 AM IST

హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట

TPT: హైకోర్టులో MBU ఛాన్సలర్ మోహన్ బాబుకు ఊరట దక్కింది. తిరుపతిలో విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ వ్యవహారంలో ఆయనపై తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు డైరీని తమ ముందు ఉంచాలన్న కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.

April 10, 2026 / 07:15 AM IST

నేడు బేతంచెర్లలో గ్రీవెన్స్ కార్యక్రమం

NDL: బేతంచెర్ల ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని టీడీపీ నాయకులు కోరారు. అటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

April 10, 2026 / 07:14 AM IST

11న జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

VZM: ప్రభుత్వ ఆదేశాల మేరకు మహత్మ జ్యోతిరావు ఫూలే 200వ జయంతి కార్యక్రమాన్ని ఏఫ్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పూలేకి నివాళులర్పించి, అనంతరం ఆడిటోరియంలో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధిలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

April 10, 2026 / 07:13 AM IST

‘నిధులు మంజూరు చేయండి’

పార్వతీపురం మండలం సూడిగంలో పాతబడిన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించాలని కోరుతూ అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణికి వినతిపత్రం సమర్పించారు. ఎంపీపీ మజ్జి శోభారాణి, వైసీపీ నాయకులు చంద్రశేఖర్ ఈ మేరకు ఎంపీ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

April 10, 2026 / 07:12 AM IST

సిలిండర్లను సకాలంలో సరఫరా చేయాలి: జేసి

కాకినాడ జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓటీపీ రాని సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలకు సమానంగా గ్యాస్ లోడ్ పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. 

April 10, 2026 / 07:12 AM IST

టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి

KRNL: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేశ్ పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గంగులపాడు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబురావు, చిన్నతుంబళం సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు వారు పేర్కొన్నారు. క్రమశిక్షణతో పనిచేయాలని మంత్రి సూచించారన్నారు.

April 10, 2026 / 07:11 AM IST

సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

ATP: గుంతకల్లు శ్రీనివాసనగర్‌కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతుల కుమారుడు సుదీప్ (10) స్థానిక చర్చి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలోనే ఉన్న ఎస్ఎస్ ట్యాంక్‌లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్ నీట మునిగి ఊపిరాడకు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 10, 2026 / 07:10 AM IST