KDP: పొద్దుటూరు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో నేరాల కట్టడికి ఇక్కడి పోలీసులు దూకుడు పెంచారు. సబ్ డివిజన్లోని Clలు, SIలు శనివారం ఉదయం స్థానిక 1- టౌన్ స్టేషన్ పరిధిలో ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. రౌడీ, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి కదలికల వివరాలను నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలులేని 92 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
KDP: చెన్నూరులో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. లక్ష్మీనగర్, దౌలతాపురం, జగనన్న కాలనీల్లో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం: తాళ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివరామపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం స్కూలు బస్సును ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కర్రపాటివారిపాలెంకు చెందిన ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
GNTR: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం గడువును పొడిగించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ చికిత్స కొనసాగుతుంది. ఈహెచ్ఎస్ ప్రమాణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందించనున్నారు.
NDL: బనగానపల్లెలో బాలికపై జరిగిన అత్యాచారయత్నం సభ్య సమాజం తలదించుకునే అనాగరిక చర్య అని మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని, బాలికకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.
CTR: మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని చిత్తూరులో ఇవాళ ఘనంగా నిర్వహించారు. పీసీఆర్ సర్కిల్ ఆయన విగ్రహానికి జేసీ ఆదర్శ రాజేంద్రన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారని తెలియజేశారు.
ASR: పాడేరు నూతనంగా ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మ ఇవాళ ఉదయం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ముందుగా తన సతీమణి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజతో కలిసి ఆయన మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు.
TPT: బడుగు బలహీన వర్గాల దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఘనంగా జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం, మహిళా విద్య కోసం ఆయన చేసిన పోరాటం దేశానికే మార్గదర్శకమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.
BPT: అద్దంకిలో బెదిరించి నగదు, బంగారం, మొబైల్ అపహరించిన కేసులో ఒంగోలుకు చెందిన సుబ్రహ్మణ్యంను శింగరకొండ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్తో పాటు 14 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు బాలురను జువెనైల్ కోర్డులో హాజరు పరచనున్నారు.
CTR: పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన పులిగుండు అభివృద్ధికి 79 ఎకరాలు ఏపీ టూరిజానికి కేటాయిస్తూ ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు, 1000 అడుగుల ఎత్తయిన రెండు రాతి కొండలు చూడ ముచ్చటగా ఉంటాయి. గత ఏడాది ఇక్కడ యోగ డేను జిల్లా అధికారులు నిర్వహించారు. ఆ ఫోటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన Xలో పోస్ట్ కూడా చేసుకున్నారు.
ELR: ఆగిరిపల్లి కొండ కాలనీలో శనివారం ఆపరేషన్ వజ్ర ప్రహర్ పేరిట పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు సిబ్బంది ఆయా ప్రాంతాలను చుట్టు ముట్టి ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 47 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
KRNL: ఆదోని- సిరుగుప్ప రహదారిలో కారు చెట్టుకు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు, డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, ఒక యువతి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఇస్వి పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PLD: సత్తెనపల్లిలోని నాగన్నకుంట, యానాది కాలనీల్లో పోలీసులు శనివారం భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో 100 మంది సిబ్బంది ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 34 వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, అ సాంఘిక కార్యకలాపాల నివారణే ధ్యేయంగా ఈ సోదాలు చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు.
సత్యసాయి: మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఘన నివాళులర్పించారు. కూటమి నాయకులతో కలిసి శనివారం ఉదయం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సామాజిక విప్లవ యోధుడుగా అంటరానితనం, సామాజిక రుగ్మతలపై పూలే చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ATP: అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ, బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, విద్య కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.