AKP: ఎస్. రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీలో అసంపూర్తిగా ఉన్న జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలని మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలో 2021లో మొదలైన జీవన్ మిషన్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు.
సత్యసాయి: తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళనాడు సాయి యువత ‘త్యాగతిన్ శిఖరంగాళ్’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. సంఘం కాలం నాటి పారి, పేగన్ వంటి ఏడుగురు గొప్ప దాతల త్యాగనిరతిని ఈ నాటకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. మూగజీవాలు, ప్రకృతి పట్ల వారు చూపిన కరుణను కళ్ళకు కట్టినట్లు చూపారు.
KRNL: మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఎస్సై మల్లికార్జున సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాపై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి, సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలకు జరిమానా విధించామన్నారు.
NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల సోమవారం తెలిపారు. బస్సుల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ను పరిశీలిస్తున్నామని, హైవేలపై బ్లాక్ స్పాట్స్ను ఇప్పటికే సరిదిద్దామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాల మరణాల రేటు 20% తగ్గిందని ఆమె పేర్కొన్నారు.
KKD: తుని మండలం డీ. పోలవరంలో సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు పెంచేందుకే ఈ కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.
KRNL: యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని సోమవారం జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనాలని సూచించారు.
VSP: ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఈనెల 15న మోడల్ కెరీర్ సెంటర్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మేళా జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత పత్రాల నకళ్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సంస్థ డిప్యూటీ చీఫ్ దొరబాబు సూచించారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని అవుకు మెట్ట వద్ద ఇవాళ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి క్యాంప్ కార్యాలయం పిలుపునిచ్చింది.
VZM: బొబ్బిలి DSP గా గోవిందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ DSPగా పని చేసిన భవ్యరెడ్డిను సరెండర్ చేసిన నేపథ్యంలో VZM DSP గా పనిచేస్తున్న ఆయనను బొబ్బిలి బదిలీ చేయడంతో బాధ్యతలు స్వీకరించి బొబ్బిలి కోటలో స్దానిక MLA బేబినాయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్లో గంజాయి, సైబర్ నేరాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
ASR: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచడం, చెరువులు, జలాశయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా “జలధార-జలహారతి” కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ నిషాంతి సోమవారం అధికారులను ఆదేశించారు.100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో, ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. నీటి వనరులకు సాంకేతికత అనుసంధానించి నీటి వనరులు పునరుద్ధరించాలన్నారు.
KDP: 2021లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కమలాపురం(M)మీరాపురంకి చెందిన కిరణ్ కుమార్ అనే నిందితుడికి కడప జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. సమర్పించిన సాక్ష్యాలు, దర్యాప్తు అధికారుల నివేదికలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైనట్లు నిర్ధారించిందని కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ మీడియాకు తెలిపారు.
CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఇవాళ ఉదయం 10 గంటలకు జిల్లా టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని నాయకులు తెలిపారు. అనంతరం పలు ప్రాంతాలలో నిర్వహించి డా.బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి కార్యక్రమాలలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
TPT: తిరుపతిలో రేపు మంత్రి నారా లోకేష్ పలు క్రీడా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 10.20 కోట్లతో నిర్మించిన NTR క్రీడా ప్రాంగణం ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, ఇతర క్రీడా సదుపాయాల పనులు కూడా చివరి స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 28.30 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు.
అనకాపల్లి జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటనిషేధం అమలులోకి రానుంది. జూన్ 14 వరకు వేట నిషేధం కొనసాగుతుంది. సముద్రంలో చేపల సంతాన ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ప్రతి ఏట మే 14 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. జిల్లాలో 31 మత్స్యకార గ్రామాల్లో 12,644 మంది మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో భృతిని అందజేస్తుంది.
PPM: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి సోమవారం ఆయన ఛాంబరులో భామిని MPDO ఎస్.వసంత కుమారిని శాలువాతో సత్కరించారు. సంపూర్ణత అభియాన్ 2.0 సక్సెస్ మీట్లో భాగంగా ఆమెను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో సంపూర్ణత అభియాన్ 2.0 విజయవంతం చేయడంలో పూర్తి బాధ్యత వహించినందుకు సత్కరించినట్టు తెలిపారు.