SKLM: మందస మండలంలో సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టీడీపీ మందస మండల అధ్యక్షులు భావన దుర్యోధన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మందస జన చెరువు దగ్గర కార్యక్రమం నిర్వహించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ఏప్రిల్ 21 నుండి జూలై 14వ తేదీ లోపల పనులన్నింటినీ పూర్తి చేయాలని తెలిపారు.
CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామపంచాయతీలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని కొత్తయిండ్లు, సింగిరిగుంట వద్ద ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, రాష్ట్ర నాయకుడు రాజారెడ్డి తదితరులు కలిసి జెండాను ఎగురవేశారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయీ నేతృత్వంలో బీజేపీ స్థాపించారని తెలిపారు.
E.G: ఆయుష్మాన్ వయో వందన కార్డులకు వైద్య సదుపాయాలు అందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ రామకృష్ణం రాజు, కో కన్వీనర్ యానాపు ఏసు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం సమర్పించారు. ఆయుష్మాన్ వయో వందన కార్డులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 11 మందిని స్థానిక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.80,800 నగదు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని సీఐ సురేష్ హెచ్చరించారు.
NTR: నందిగామలో వ్యవసాయ అధికారి (టెక్నికల్)గా పనిచేస్తున్న కే. వెంకటేశ్వరరావు కంచికచర్ల ఇంఛార్జ్ మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పనిచేసిన కే. విజయ్కుమార్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్పై వెళ్లారు. కొత్త అధికారితో రైతులకు సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.
అన్నమయ్య: బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించిన తర్వాత గొడవలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నమయ్య: బోయకొండ అడవిలో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించిన తర్వాత గొడవలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
NDL: నందికొట్కూరులో శ్రీశైలం నీటి ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. సాగునీరు లక్షల ఎకరాలకు అందుతున్నా తమ త్యాగాలు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల రైతుల కోసం చట్టాలు చేస్తూ, దశాబ్దాలుగా పోరాడుతున్న తమ హక్కులపై ప్రభుత్వం మౌనం ఎందుకని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పరిగి ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 తోపుడు బండ్లు, 27 ట్రైసైకిళ్లు, 286 డస్ట్బిన్లను పంచాయతీ వారీగా పంపిణీ చేశారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ATP. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు నాయుడుకు MLA జేసీ అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. సోమవారం యాడికిలో సీఎంను కలిసిన వారు.. బుద్ధుడి విగ్రహంతో కూడిన ప్రత్యేక అమరావతి లోగోను బహూకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలను సీఎం అభినందించారు.
TPT: తిరుపతిలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ స్థాపన, అభివృద్ధిపై నాయకులు ప్రసంగించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో 16 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
W.G: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్నోవా కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను సోమవారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, తదితర విషయాలపై మంత్రి నారా లోకేష్తో చర్చించారు. నిధుల కేటాయింపులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
AKP: తిమ్మాపురం పంచాయతీ పరిధిలో విద్యుత్ స్తంభాలు, వైరుకు కలిపి రూ.1.90 లక్షలు విద్యుత్ శాఖకు కట్టినా ఇప్పటివరకు పనులు జరగలేదని గ్రామ మాజీ సర్పంచ్ కె సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వీధిలైట్లు సౌకర్యం కోసం కట్టి రెండు నెలలు దాటుతున్నా సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
KDP: మైదుకూరు వైసీపీ పర్యవేక్షకుడిగా రమేశ్ యాదవ్ నియామకంపై ఆలోచన జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ MLAగా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన విజయం నేపథ్యంలో, అదే యాదవ్ వర్గానికి చెందిన రమేశ్ను పర్యవేక్షకుడిగా నియమించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.