W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో భారీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, కియా మోటార్స్, బాటా ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు గల యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు.
చిత్తూరు: కుప్పం టీడీపీలో కోఆర్డినేషన్ కనిపించడం లేదని, ఎవరికి వాళ్లు గ్రూపులు కట్టుకుని పోతున్నారని CM చంద్రబాబు పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో తన PAగా ఉన్న మనోహర్ 6 ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని అప్పుడు కోఆర్డినేషన్ సమస్య ఏనాడూ రాలేదని, కుప్పం తన నియోజకవర్గమనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పనిచేయాలని CM హెచ్చరించినట్లు సమాచారం.
కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.195.21 కోట్లు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. జిల్లాలో రవాణా శాఖకు కడపలో డీటీసీ, ప్రొద్దుటూరులో ఆర్టీవో ,పులివెందుల, బద్వేల్, రాజంపేటలో MVI కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి లైఫ్ టాక్స్ రూపంలో రూ.168.22 కోట్లు, ఫీజుల ద్వారా రూ.16 కోట్లు,పెనాల్టీల ద్వారా రూ.6.70 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.4 కోట్లు ఆదాయం లభించింది.
KKD: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతీక రాజధాని అమరావతి అని, రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాకినాడ కూటమి శ్రేణులు తమ ఇళ్ల ముందు మన రాజధాని మన అమరావతి అని రంగవల్లికలతో ముగ్గులు వేశారు.
VZM: యువత మత్తుపదార్దాలకు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని రూరల్ సీఐ లక్ష్మణరావు సూచించారు. ఆదివారం సాయంత్రం స్దానిక వీటీ ఆగ్రహరం వై జంక్షన్ ప్రాంతంలో యువతకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. IPL జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగులు ఆడరాదని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తారని కలెక్టర్ రాజకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అర్జీలను ప్రత్యక్షంగా లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చన్ని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ 1100 ద్వారా పరిష్కార స్థితి తెలుసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.
PPM: జిల్లాలో త్వరలో డోలి యాత్ర ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఆదివారం డోలి రోడ్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డోలి రోడ్లను మంజూరు చేశామని తెలిపారు.
KRNL: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 6న కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు నగర అధ్యక్షుడు డి. అబ్దుల్ దేశాయి ఆదివారం తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కార్మికులకు పింఛన్, బీమా, ఇల్లు స్థలం వంటి ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
NTR: పాయికాపురంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై స్థానిక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికకు కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భం దాల్చినట్లు తేలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కోనసీమ: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో మత్స్యకారుల సమావేశం ఇవాళ జరగనుంది. తమిళనాడుకు చెందిన జాలర్లు అక్రమంగా తమ సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించి మరబోట్లతో తమ వలలు, బోట్లకు నష్టం చేస్తున్నారన్న సమస్యపై చర్చించనున్నారు. తిరుపతి, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ELR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా రావడమే కాకుండా, ‘మీకోసం’ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
NDL: రుద్రవరం మండలం విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆపరేటర్లను ఉన్నతాధికారులు తొలగించినట్లు AE రాజశేఖర్ నిన్న తెలిపారు. ఎల్లావత్తుల సబ్ స్టేషన్ నుంచి హరి, చిన్నకంబలూరు నుంచి పెద్దిరెడ్డి, ఆలమూరు నుంచి నరసింహనాయక్, హరినగరం నుంచి ఆంజనేయులు అనే ఆపరేటర్లను తొలగించినట్లు తెలిపారు. వారంతా నకిలీ ధ్రువపత్రాలతో విధుల్లో చేరినట్లు వెల్లడించారు.
ASR: అనంతగిరి మండలంలోని కాకరపాడు పీవీటీజీ గ్రామానికి బీటీ రోడ్డు పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మట్టి రోడ్డు దెబ్బతిని రాళ్లు తేలడంతో రాకపోకలు కష్టమయ్యాయి. అంబులెన్స్ సహా వాహనాలు గ్రామానికి చేరలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ఇవాళ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూరప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.