నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తారని కలెక్టర్ రాజకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అర్జీలను ప్రత్యక్షంగా లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చన్ని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ 1100 ద్వారా పరిష్కార స్థితి తెలుసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.