PPM: జిల్లాలో త్వరలో డోలి యాత్ర ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఆదివారం డోలి రోడ్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డోలి రోడ్లను మంజూరు చేశామని తెలిపారు.