E.G: రాజమండ్రిలో ఆదివారం వైసీపీ పెద్దలు ఒకే వేదికగా కలిశారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి తనయుడు, మాజీ రుడా చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి దంపతుల కుమార్తె యొక్క నిశ్చితార్థం వేడుకలు మంజీరా కన్వ్ న్ హాల్ లో జరిగాయి. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మార్గాని మోనా, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు మెరిసారు.
కడప జిల్లాలోని మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సీఐ లింగప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, చీటింగ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు ఇవ్వాలని సూచించారు.
ELR: కైకలూరు మండలం కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం కావడంతో భక్తులతో కీటకటలాడింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అమ్మవారికి వివిధ రూపాలలో ఒక్కరోజు రూ.72,492 ఆదాయంగా లభించింది అన్నారు.
PLD: మాచర్ల శాఖ గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి మెర్సి తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లు పక్కన పెట్టి పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, పోటీ పరీక్షల అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
KKD: సాక్షులను బెదిరించిన కేసులో రిమాండ్పై సెంట్రల్ జైల్లో ఉన్న YCP MLC అనంతబాబుకు కష్టాలు పెరగనున్నాయి. సోమవారం ఆయనను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విచారణ అధికారి చెన్నకేశవరావు తెలిపారు. స్టేషన్లో విచారించినప్పుడు తనకు ఏమీ తెలియదని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వదంతులు నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ స్పష్టం చేశారు. జిల్లాలోని 211 బంకుల్లో 14.45 లక్షల లీటర్ల పెట్రోల్, 13.34 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఎక్కువ కొనుగోలు చేయవద్దని కోరారు. బ్లాక్ మార్కెట్ చేస్తే బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అన్నమయ్య: రామసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెంబకూరు పంచాయతీ ఎర్రబయలుపల్లెకు చెందిన చందు (14) గుడికి హారం వేస్తూ కరెంట్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: సంతానోత్పత్తిపై అవగాహన పెంచడానికి ఓయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ చేపట్టిన జనని యాత్ర తిరుపతికి చేరుకుంది. సంతానలేమి దంపతులకు పలు అంశాలపై అవగాహన కల్పించింది. ఉచితంగా హిమోగ్లోబిన్, AMH పరీక్షలతో పాటు వీర్య విశ్లేషణ చేపట్టింది. మారిన జీవన శైలి, ఆలస్యంగా పిల్లలు కనాలని అనుకోవడంతో సంతానోత్పత్తి రేట్ తగ్గుతోందని డాక్టర్లు వివరించారు.
VZM: రాజాం మండలం శ్యాంపురం గ్రామ పరిధిలోని బ్రాహ్మణ అగ్రహారంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్మాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తుల సమక్షంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు నిర్వహించారు.
VZM: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై జరజాపుపేటలో నెల్లిమర్ల SI గణేష్ అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. యువత, విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో వివరించారు. డ్రగ్స్కు అలవాటు పడితే శారీరక, మానసిక సమస్యలు తలెత్తడమే కాకుండా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.
NDL: గడిగరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా బోగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు వివిధ రకాల ద్రవ్యాలతో దాతల ఆధ్వర్యంలో మంగళ స్నానం, రుద్రాభిషేక పూజలు వైభవంగా జరిపారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు హాజరు కావాలన్నారు.
కోనసీమ: అమలాపురం మండలం వేమవరప్పాడు గ్రామంలో మానుపాటి గోవింద అనే కొబ్బరి కార్మికుడు కొబ్బరికాయలు దింపు పనిలో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టుపై కొబ్బరికాయలు దింపుతున్న సమయంలో కొబ్బరాకు అడ్డుగా ఉండటంతో దానిని తొలగించే ప్రయత్నంలో గోవింద విద్యుత్ తీగలను తాకాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
NTR: విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలోని రైస్ మిల్లును ఆర్డీవో ఏ.కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం దిగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మిల్లులో ఏర్పాట్లు, కొనుగోలు విధానంపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కే.లక్ష్మీ కళ్యాణి పాల్గొన్నారు.
KRNL: ఆదోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన అవెంజర్ బైక్ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. హైదరాబాద్కు చెందిన సోమశంకర్ జరిమానా చెల్లించినప్పటికీ బైక్ ఇవ్వలేదని ఇవాళ ఆరోపించాడు. ఏడు నెలల తర్వాత స్టేషన్కు వెళ్లగా బైక్ మాయం అయినట్టు తెలిసి షాక్కు గురయ్యాడు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, ఆయన తల్లి డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సారధి స్పష్టం చేశారు. కలెక్టర్, జెసి , ఆయిల్ కంపెనీలో ప్రతినిధులతో ఇవాళ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజిల్ కొరత ఉందని మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని అసత్య ప్రచారాలు కొనసాగకుండా చూడాలన్నారు.