• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చోడవరంలో గ్రామసభ ఏర్పాటు

AKP: చోడవరం మండల కేంద్రంలో ఇవాళ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చోడవరం ఎంపీడీవో ఆంజనేయులు తెలిపారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

April 14, 2026 / 04:44 PM IST

అందుబాటులోకి రానున్న అన్న క్యాంటిన్

కృష్ణా: అవనిగడ్డలో రూ.61 లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్ అందుబాటులోకి రానుంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ క్యాంటీన్ ప్రారంభిస్తారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో ఈ అన్న క్యాంటీన్ నిర్మించారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈ అన్న క్యాంటీన్ ప్రారంభం కానుండటంతో కార్మికులకు మేలు కలుగనుంది.

April 14, 2026 / 04:43 PM IST

పీఎం సూర్యా ఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మెలియాపుట్టి మండల కేంద్రంలో పీఎం ఎస్సీ,ఎస్టీ సూర్యఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 04:43 PM IST

ఈ నెల 21ఆఖరి తేదీ.. వీళ్లు మాత్రమే అర్హులు

ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలోని 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుడు రామ్ కుమార్ మంగళవారం తెలిపారు. గ్రూప్-4కు డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-52 ఏళ్లున్న వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను అందజేయాలని చెప్పుకొచ్చారు.

April 14, 2026 / 04:41 PM IST

‘అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం’

CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బీ.ఆర్. అంబేద్క‌ర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు అంబేద్క‌ర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం, సుజాత పాల్గొని బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు.

April 14, 2026 / 04:40 PM IST

మైక్రో ఫిల్టర్ ప్లాంటును ప్రారంభించిన RRR

W.G: మండల కేంద్రమైన కాళ్ల మేజర్ పంచాయతీలో మంగళవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మిలియన్ లీటర్ల మైక్రో ఫిల్టర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీని ఏర్పాటు చేసేందుకు దాత సంధ్యా మెరీన్ సహకారం అందించినట్టు తెలిపారు. స్వచ్చమైన త్రాగు నీరు ప్రతీ గ్రామానికి అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

April 14, 2026 / 04:27 PM IST

బనగానపల్లెలో మంత్రి బీసీ సుడిగాలి పర్యటన

NDL: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. డ్రైనేజీ, రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోయిన బాధితుల కోసం చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేసి బాధితులకు సకాలంలో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. షాదీఖానా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

April 14, 2026 / 04:25 PM IST

సోషలిస్ట్ దేశాలలో ఆదర్శ పాలన

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో మంగళవారం పీసీ కేశవరావు అధ్యక్షతన సీపీఎం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలు పోరాటాలు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి శిక్షణ ఇవ్వడం జరిగింది. సోషలిస్ట్ దేశాలు ఆదర్శ పాలన సాగిస్తున్నాయన్నాయి, మనదేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ పాలన సాగుతుందన్నారు.

April 14, 2026 / 04:20 PM IST

ఎర్ర చెరువు పనులను పరిశీలించిన పీడీ

AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం గ్రామంలో జరుగుతున్న ఎర్ర చెరువు పనులను డూమా పీడీ నిర్మలదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ ఆధారిత హాజరులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి 10 గంటలకు ముగించాలన్నారు. అలాగే, పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.

April 14, 2026 / 04:15 PM IST

‘చిన్నారులను ప్రభుత్వ బడిలో చేర్పించండి’

SKLM: మందస మండలం పిడి మందసలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈమేరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఉచిత సదుపాయాలు, నాణ్యమైన బోధన గురించి వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.

April 14, 2026 / 04:15 PM IST

అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు: బుగ్గన

KRNL: చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతారు తప్ప, వెనుకబడిన ప్రాంతాల గురించి ఎందుకు ఆలోచించరని ఇవాళ  మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ‘MAVIGUN’తో కేవలం రూ.10-20వేల కోట్లతో రాజధాని నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

April 14, 2026 / 04:13 PM IST

సాలూరులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

PPM: సాలూరు మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. SEWA (షెడ్యూల్డ్ కాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 04:12 PM IST

ధరణికోటలో పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభం

PLD: అమరావతి మండలం ధరణికోటలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్సిడీతో లబ్దిదాదులు ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. అనంతంరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

April 14, 2026 / 04:10 PM IST

గ్రామ సమస్యలపై చర్చా సమావేశం

NTR: రామచంద్రాపురం సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఎంపీడీవో భవాని గ్రామ సభ సమావేశం నిర్వహించి, గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను చర్చించారు. వాటి పరిష్కారానికి అవసరమైన తీర్మానాలు చేశారు.

April 14, 2026 / 04:10 PM IST

హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

ELR: విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీవరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కొందరిని వీఆర్‌కు పంపిన ఎస్పీ, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 14, 2026 / 04:06 PM IST