• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘స్వచ్ఛరథం సేవలను సద్వినియోగం చేసుకోవాలి’

AKP: స్వచ్ఛ రథం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కైలాసపట్నంలో స్వచ్ఛరథం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అట్టపెట్టెలు, పనికిరాని ఇనప వస్తువులు, కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు స్వచ్ఛరథానికి అందిస్తే కావలసిన నిత్యవసర సరుకులను పొందవచ్చునని అన్నారు.

April 16, 2026 / 05:13 PM IST

పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

PPM: వీరఘట్టం పీహెచ్‌సీని ఆకస్మికంగా డా. ఎన్.ప్రభాకర రెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులతో స్నేహభావంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అలాగే, రోగులు ఆసుపత్రిలోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేంత వరకు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు.

April 16, 2026 / 05:12 PM IST

డుంబ్రిగుడలో బ్యాంకింగ్ సేవలు

ASR: డుంబ్రిగుడ మండలంలోని గిరిజన గ్రామాలకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సేవా కేంద్రాల ద్వారా ఖాతాల ప్రారంభం, ఇన్సూరెన్స్ వంటి సేవలు 5 నిమిషాల్లో అందిస్తున్నారు. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించామని జోనల్ హెడ్ శ్రీనుబాబు తెలిపారు. గిరిజనులకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

April 16, 2026 / 05:11 PM IST

ఆరోగ్య సూత్రాలపై విద్యార్థులకు అవగాహన

CTR: ఆరోగ్య సూత్రాలు పాటించినప్పుడే రోగాలు దరి చేరవని పుంగనూరు అర్బన్ PHC డాక్టర్ కిరణ్మయి విద్యార్థులకు సూచించారు. గురువారం మేలుపట్ల గిరిజన బాలికల వసతి గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యక్తిగత శుభ్రత, హ్యాండ్ వాష్, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

April 16, 2026 / 05:02 PM IST

‘తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి’

ELR: పోలవరం కుడి కాలువ పరిసర గ్రామాలకు గోదావరి జలాలను తాగునీరుగా అందించేందుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ దెందులూరులో నిర్వహించిన ‘జలజీవన్ మిషన్ 2.0’ సమీక్షలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే తమ లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి అంచనాలు రూపొందించాలన్నారు.

April 16, 2026 / 05:00 PM IST

పోలీస్ స్టేషన్‌లో వంశీ ఫిర్యాదు.!

కృష్ణా: వల్లభనేని వంశీ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. గురువారం ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారి ఆధారాలను వంశీ పోలీసులకు సమర్పించారు. వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

April 16, 2026 / 04:50 PM IST

‘ప్రజలకు ఆకర్షణీయ వడ్డీ రేట్లు’

VZM: ప్రజలకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను డీసీసీబీ అందిస్తోందని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు విజయనగరం పట్టణానికి చెందిన ఎం. లక్ష్మి నారాయణ, ఛైర్మన్ సమక్షంలో గురువారం విజయనగరం బ్రాంచ్‌లో FD రూపంలో రూ. 5,10,000లు జమ చేశారు. డీసీసీబీ ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఆర్థికంగా బలంగా ఎదుగుతోందన్నారు.

April 16, 2026 / 04:45 PM IST

‘ముఖ ఆధారిత మస్తర్ విధానాన్ని రద్దు చేయాలి’

W.G: ఉపాధి హామీ పథకం కార్మికులకు ముఖ ఆధారిత మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో ఉపాధి హామీ పని ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముఖ ఆధారిత మస్తర్ విధానం వల్ల కూలీల కళ్లు సరిగా స్కాన్ కావడం లేదన్నారు. దీంతో నిరాశతో కూలీలు వెనుతిరుగుతున్నారన్నారు.

April 16, 2026 / 04:45 PM IST

రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం చినభోగిలి గ్రామంలోని శ్రీ రామాలయాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం సందర్శించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఆయన శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

April 16, 2026 / 04:44 PM IST

డ్వాక్రా సంఘాల శిక్షణ కార్యక్రమం

VZM: జామి మండలం కుమారం గ్రామంలో గురువారం ACLP డ్వాక్రా సంఘాల శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం అప్పలనాయుడు మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా యాన్యువల్ క్రెడిట్ లైలీవుడ్ ప్లాట్స్, వార్షిక రుణ జీవనోపాదుల ప్రణాళిక వంటి అంశాల మీద చర్చించారు.

April 16, 2026 / 04:43 PM IST

అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి: ఎమ్మెల్యే

ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఇవాళ పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

April 16, 2026 / 04:40 PM IST

శ్రీశైలం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: YCP

KRNL: రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతున్నాయని వైసీపీ ధ్వజమెత్తింది. రుద్రవరం టోల్ ప్లాజా వద్ద తనను గుర్తించలేదన్న కోపంతో మహేష్ అనే ఉద్యోగిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బెదిరించారు. ఆయన ఆదేశాలతో అనుచరులు సదరు ఉద్యోగిని వాహనంలో బలవంతంగా ఎమ్మెల్యే సొంత గ్రామానికి తరలించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేసింది.

April 16, 2026 / 04:40 PM IST

‘గిట్టుబాటు ధర కల్పించాలి’

SKLM: మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రణస్థలం మండలం నగరపాలెంలో పంటను గురువారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. క్వింటాలు రూ. 2400 నుంచి రూ. 1600కి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

April 16, 2026 / 04:38 PM IST

‘విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి’

KDP: విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. ఇవాళ పులివెందులలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం, సోలార్ ప్రాజెక్టు పనులు, విద్యుత్ సేవల పురోగతి తదితర వాటిపై సమీక్షించారు. పగటిపూట వీధిలైట్లు వెలగకుండా చూడాలన్నారు.

April 16, 2026 / 04:37 PM IST

‘ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయాలి’

బాపట్ల: జిల్లాలో ఎన్‌సీడీ సర్వే జాప్యంపై కలెక్టర్ వీ. వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూరుశాతం సర్వే పూర్తయ్యేలా చూడాలని అధికారులను గురువారం ఆదేశించారు. ఆభా(ABHA) ఐడీల ద్వారా వైద్యసేవల డిజిటలైజేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే, ఆయుర్వేద ఆస్పత్రుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

April 16, 2026 / 04:34 PM IST