• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జనగణనను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

NDL: జనగణన 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. https://se.census.gov.in ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు.

April 14, 2026 / 08:14 PM IST

‘స్వీయ గణన విధానంపై అవగాహన కల్పించాలి’

AKP: జనగణన-2027లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. తొలిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల పౌరులు se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చునన్నారు.

April 14, 2026 / 08:13 PM IST

నీటి కష్టాలతో గిరిజన కుటుంబాల వేదన

ASR: అనంతగిరి మండలం గాదిల్లోవ గ్రామంలో గిరిజనులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 23 కుటుంబాలు మైళ్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. వర్షాకాలంలో బురద నీరు తాగాల్సి రావడంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

April 14, 2026 / 08:11 PM IST

అమరవీరులకు ఘన నివాళులు

PPM: పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవర్ పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ అగ్నిమాపక అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 231 మంది అమరవీరులకు  నివాళులర్పించారు.

April 14, 2026 / 08:11 PM IST

‘కన్నీళ్లు తెప్పించిన అంబేద్కర్ సినిమా’

GNTR: తెనాలిలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రదర్శించిన అంబేద్కర్ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చిత్రాన్ని చూస్తూ పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, నటీనటులు పాల్గొన్నారు.

April 14, 2026 / 08:10 PM IST

వెలుగు వీఓఏలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వెలుగు సంఘాల సహాయకులు, వీఓఏలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న 51 మంది వీఓఏలకు ఎమ్మెల్యే, ఆకుల రామకృష్ణ చేతుల మీదుగా స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు.

April 14, 2026 / 08:00 PM IST

రేపే ఇంటర్ ఫలితాలు

KRNL: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను రేపు(బుధవారం) విడుదల చేయబోతున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా HIT TV యాప్ లో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

April 14, 2026 / 07:52 PM IST

‘అంబేద్కర్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి’

VSP: డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు.

April 14, 2026 / 07:44 PM IST

ఎస్టీలకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే

NLR: ఉదయగిరి మండల పరిధిలోని బండగానిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామ ఎస్టీలకు ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ నివేశిత (ఇంటి) స్థలాలు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. 32 మంది ఎస్టీలకు నివేశిత స్థలాల పట్టాలతో పాటు ఆయన ట్రస్టు ద్వారా మహిళ లబ్ధిదారులకు చీరలు అందజేశారు. అనంతరం బిజ్జంపల్లిలో రూ.46.80 లక్షలతో సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.

April 14, 2026 / 07:41 PM IST

కళాశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు

W.G: దుంపగడప వీ.వీ. గిరి ప్రభుత్వ కళాశాలలో డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. టీ. నాగేశ్వరావు అధ్యక్షత వహించి అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలను వివరించారు. ముఖ్యవక్తగా యూ. శ్రీనివాసరావు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను తెలియజేశారు. అనంతరం విగ్రహానికి నివాళులు అర్పించారు.

April 14, 2026 / 07:30 PM IST

వడదెబ్బతో వృద్ధుడు మృతి

NDL: పగిడ్యాల మండలం ఎం. గణపురం గ్రామానికి చెందిన వడ్డె మద్దిలేటి (65) వడదెబ్బతో మృతి చెందారు. ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 14, 2026 / 07:24 PM IST

‘మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవాలి’

VSP: మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని నాయకత్వంలో ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా రిజర్వేషన్‌పై నిపుణుల చర్చలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవసరమని, మహిళలకు నిర్ణయాధికారం పెరగాలని పేర్కొన్నారు.

April 14, 2026 / 07:15 PM IST

గర్భిణీలు, బాలింతలకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ

విజయనగరం ఘోష ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతిని పురస్కరించుకుని బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్, మాతృభూమి సేవా సంఘం మానవీయత చాటుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 250 మంది గర్భిణీలు, బాలింతలకు బిస్కట్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి బాజ్జీ, భోగవిల్లి వెంకట రమణ పాల్గొన్నారు.

April 14, 2026 / 07:14 PM IST

‘శతశాతం స్వీయ గణన నమోదు కావాలి’

PPM: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి మే 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం జరగనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా దేశంలో తొలిసారిగా డిజిటల్ మోడ్‌లో ఈ నెల 16 నుంచి 30 వరకు se.census.gov.in పోర్టల్ నందు వ్యక్తిగతంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.

April 14, 2026 / 07:14 PM IST

నిందితుడు ఆత్మహత్య…!

SKLM: పలాస మండలం మహాదేవిపురంలో విషాదం చోటుచేసుకుంది. జంట హత్యల కేసులో నిందితుడైన మడియా రామారావు (45) తన నివాసంలో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోంపేట మండలం పాలవలస, మందస మండలం దున్నవూరులలో జరిగిన జంట హత్యలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 14, 2026 / 07:12 PM IST