E.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్లో జేసీ మేఘ స్వరూప్తో కలిసి 183 అర్జీలను స్వీకరించారు. PGRS కింద వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహించరాదన్నారు.
సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం అని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. సోమవారం మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 82 మందికి లబ్ధిదారులకు గాను రూ.30.34 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అని,పేద ప్రజలు అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తారన్నారు.
KKD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం ఇంఛార్జ్ ఈవో నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఈవో త్రినాథరావు పుష్కరాల విధుల్లో బిజీగా ఉండటంతో వాడపల్లి ఈవో చక్రధరరావు, కాకినాడ డీసీ రమేష్ బాబు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. చక్రధరరావుకు ఆర్జేసీగా పదోన్నతి ఉండటంతో ఆయన నియామకానికే మొగ్గు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఆర్డర్ రావాల్సి ఉంది.
కోనసీమ: ప్రభుత్వ ఆదేశాలు మేరకు డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను రావులపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా నిర్వహించాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సోమవారం ఆదేశించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరపాలని, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యులు జీవనోపాధులు, ఎంటర్ప్రైజ్ స్థాపన కోసం రుణాలు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ సూచించారు. 50 శాతం మంది మహిళలు వ్యవస్థాపకులుగా ఎదిగేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
కృష్ణా: కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం నాగాయలంక మండలం సంగమేశ్వరంలో రూ.23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
GNTR: తెనాలిలో సోమవారం RTC డిపోలో RO వాటర్ ప్లాంట్ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యం, వారి ఆరోగ్యం ప్రాధాన్యత ఇస్తూ.. మంచినీటి సౌకర్యం కల్పించామని తెలియజేశారు. జోనల్ ఛైర్మన్కు తెనాలి RTC డిపో మేనేజర్ రాజశేఖర్ ఘన స్వాగతం పలికారు.
ప్రకాశం: టంగుటూరులోని కొండపి ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్పైకి దూసుకువెళ్లింది. ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు కంటైనర్ లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా లారీ డ్రైవర్ తెలిపాడు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూస్తారు.
NTR: ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకునేందుకు ఆన్లైన్ యోగా అద్భుత అవకాశమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘అమరావతి యోగా’ యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను ప్రారం...
VSP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ నిర్వహించిన ‘డయల్ యువర్ APEPDCL సీఎండీ’ కార్యక్రమంలో 45 వినతులు అందాయి. లో-వోల్టేజ్, బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ మార్పులు, సోలార్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వాటిని పరిశీలించి తక్షణ చర్యలకు ఆదేశించారు.
VZM: దేశవ్యాప్తంగా మెగా యూత్ ఫోర్స్ విస్తరణకు ప్రతి ఒక్క మెగా అభిమాని కృషి చేయాలని మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబి పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్లో ఈ సమావేశం ఇవాళ నిర్వహించారు. చిరంజీవికి దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారని, అభిమానులంటే ఆయనకూ ప్రత్యేకమైన అభిమానముందని తెలిపారు.
గుంటూరు జిల్లా పోలీసు శాఖ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని PGRS నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల ఫిర్యాదులను నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు.
SKLM: టెక్కలిలో ఉన్న ఐతం కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 2026లో గ్రాడ్యుయేట్ అయిన 9 మంది విద్యార్థులకు హైదరాబాద్కు చెందిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. వీరికి ప్రారంభ వార్షిక వేతనం రూ. 3.19 లక్షలు అందనుంది. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.
KDP: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ స్మిత ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత సెల్ కన్వీనర్ శివమ్మ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. అధ్యాపకులు విద్యార్థినులకు విలువైన సూచనలు అందించగా, కార్యక్రమం మహిళా సాధికారతకు ప్రేరణగా నిలిచింది.
KKD: భారత కమ్యూనిస్టు పార్టీ సామర్లకోట ఆధ్వర్యంలో టిడ్కో గృహల రుణాలు రద్దు చేయాలని సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. సామర్లకోట పట్టణ జగ్గమ్మగారి పేటలోని టిట్కో గృహ సముదాయాలు సుమారుగా 500 గృహాలు ఉన్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన ఈ గృహాలు నిర్మించారని తెలిపారు.