తూ.గో జిల్లాలో సెన్సస్–2027లో భాగంగా స్వీయ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, వివరాలతో పాటుగా కుటుంబ సభ్యులు వివరాలు కూడా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
NLR: పొదలకూరులో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం మారుతీ నగర్ అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజలకు ఎలక్ట్రికల్, గ్యాస్, వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా సురక్షితంగా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలం చిన్న పిల్లలు బావులు, చెరువుల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
KDP: మైదుకూరు పట్టణ ప్రాంతానికి చెందిన పలువురు యువత వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన యువత అటవీ ప్రాంతానికి వెళ్లి తొట్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలతో బిందెల ద్వారా నీటిని తెచ్చి మూగజీవాల దాహార్తి తీరుస్తున్నారు. అటవీ అధికారులు చేపట్టాల్సిన పనిని స్వచ్ఛంద సేవకులు చేస్తూ ఉండడం పట్ల పలువురు యువతను అభినందిస్తున్నారు.
ELR: చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ విభాగంలో 979 మార్కులతో జిల్లాలో రెండవ స్థానంలో నిలిచిన మారుమూడి చరిష్మాను ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని అభినందించారు. నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ కళాశాలలు , పాఠశాలలో పెను మార్పులు తీసుకొచ్చారని వివరించారు.
TPT: తిరుపతిలో తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి కళాకారులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ఛైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కందుకూరి వీరేశలింగం తన రచనలు, నాటకాల ద్వారా ఆంధ్రులను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.
VZM: ఈనెల 17న విజయనగరంలోని MR కాలేజ్లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా ఇవాళ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీలు సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు అర్హులని పేర్కొన్నారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో పీయూసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రజా రంగ సంస్థల పనితీరుపై చర్చించారు. అలాగే, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని తెలిపారు.
PPM: సీతానగరం మండలంలోని 35 గ్రామపంచాయతీల నాయకులతో స్థానిక మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీని తెలుగు గౌరవం కోసం, తెలుగు వారి ఆత్మ అభిమానం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీడీపీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని అన్నారు.
విశాఖలోని శ్రీహరిపురం మార్కెట్ సముదాయం వాకర్స్ జోన్ వద్ద గాలివానకు తాటి చెట్టు నేలకూలింది. చెట్టు ముందు భాగం విరిగి పార్కింగ్లో ఉన్న కారుపై పడటంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు స్పందించి చెట్టును తొలగించారు.
ELR: నూజివీడు పట్టణంలోని పోతురెడ్డిపల్లి రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మంత్రి పార్థసారథి సొంత నిధులతో ఇవాళ భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మంత్రి పార్థసారథి జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా, ఆయనను శిరిడి సాయి ఎల్లవేళలా ఆశీర్వదించి, అండగా నిలవాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CTR: వీ.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. MPCలో మమత (979), CECలో తస్మియా భాను (967), BiPCలో వనిత (951), నర్సింగ్లో మోహర్ (926) ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు జాకీర్, డా. తమీం, అఖిల్ అహ్మద్ తదితరులు విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు.
KRNL: పెద్దకడబురుకి చెందిన బొగ్గుల దేవన్న అనే రైతుకు చెందిన సుమారు 4 ఎకరాల వరిగడ్డి ఇవాళ అగ్నికి ఆహుతి అయింది. ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు రైతు వాపోయారు. కళ్లెదుటే మూగజీవాలకు ఆహారంగా నిల్వ ఉంచిన వరిగడ్డి బూడిద కావడంతో రైతు బొరున విలపించాడు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
KDP: ఖాజీపేట మండలం అగ్రహారంలో నత్తఢ్ షావల్లి దర్గా వద్ద ఏర్పాటుచేసిన చేతి పంపు చాలా కాలంగా మరమ్మతుకు గురైందని, అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు అన్నారు. వేసవికాలంలో తాత్కాలిక నీటి అవసరాల కోసం చేతి పంపు ఎంతగానో ఉపయోగంగా ఉండేదని స్థానికులన్నారు. RWS అధికారులు ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని చేతిపంపును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
NLR: కలెక్టరేట్ ప్రాంగణంలోని డీఆర్డీఏ కార్యాలయం వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా కలెక్టరేట్కు వచ్చే సందర్శకుల కోసం ఈ తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.
E.G: నిరుద్యోగ రహిత రాజమండ్రిని నిర్మించడమే తమ లక్ష్యం అని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18వ తేదీన రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళాలో 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, పీజీ చదివినవారు అర్హులన్నారు.