• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

KRNL: ఆదోని విజయనగర్ కాలనీలో 18 రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందిన పింజారి మహమ్మద్ అలీ కుటుంబానికి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ రూ.20,000 ఆర్థిక సాయం అందించారు. ఐదుగురు చిన్న ఆడపిల్లలతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి భవిష్యత్తులో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

September 4, 2025 / 06:17 PM IST

కొత్తపేటలో వ్యక్తి దారుణ హత్య

సత్యసాయి: ధర్మవరం కొత్తపేటలో ఇవాళ సాయంత్రం వ్యక్తి దారుణ హత్యకు గురవడంతో కలకలం రేగింది. ప్రైవేట్ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడు కొత్తపేటకు చెందినవాడని గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

September 4, 2025 / 06:17 PM IST

పేద విద్యార్థుల యూనిఫామ్స్ కోసం ఆర్థిక సాయం

E.G: ప్రభుత్వ పాఠశాలలోని 35 మంది విద్యార్థినులకు స్కూల్ యూనిఫామ్స్ నిమిత్తం టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.రవి రామ్ కిరణ్ గోరంట్ల రూ.36 వేలు ఆర్ధిక సహాయం గురువారం అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు ఉన్నత విద్యని అభ్యసించాలని ఆయన అన్నారు. శ్రద్ధతో చదువులు చదివి తలిదండ్రులకు మంచిపేరు తేవాలన్నారు.

September 4, 2025 / 06:15 PM IST

భారీగా ముఖ్యమంత్రి సహాయనిధి సాయం

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు 99 మందికి రూ.73.97.లక్షలు అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 379 మందికి దాదాపుగా రూ.4 కోట్లు సాయం అందించామన్నారు.

September 4, 2025 / 06:15 PM IST

యూరియా కొరతపై ఆందోళనకు సిద్ధం కండి

ELR: జంగారెడ్డిగూడెంలో గురువారం వైసీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చింతలపూడి నియోజకవర్గ ఇంఛార్జ్ కంభం విజయరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ నెల 9వ తేదీన పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు రాష్ట్రంలో యూరియా కొరత పై ఆయా ప్రాంతాలలో ఉన్న ఆర్డీవో కార్యాలయ వద్ద నిరసన చేపట్టాలని సూచించారన్నారు. ఇందులో నియోజకవర్గ రైతులు పాల్గొనాలన్నారు.

September 4, 2025 / 06:15 PM IST

‘గుమ్మనూరు దిష్టిబొమ్మ దగ్ధం’

NDL: సోలార్ ప్రాజెక్టు భూసేకరణ పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాక రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు నందికోట్కూరులో ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుత్తి, పామిడి మండలంలో ప్రాజెక్టు భూసేకరణ వెళ్లిన వారిపై గుంతకల్లు ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం దుర్మార్గం అన్నారు.

September 4, 2025 / 06:15 PM IST

మర్రిపూడిలో దోమల మందు పిచికారి

ప్రకాశం: మర్రిపూడి గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు స్ప్రే చేశారు. గంగపాలెం, ఎస్సీ కాలనీ, తూర్పు బజారు, పడమటి బజారు ప్రాంతాల్లో మురికి కాలువల్లో దోమలమందు చల్లారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి బీ.వీ నాయుడు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

September 4, 2025 / 06:11 PM IST

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం ఆదేశం

ATP: అనంతపురంలో ప్రపంచ ప్రఖ్యాత ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై గురువారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

September 4, 2025 / 06:11 PM IST

ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులకు భూమి పూజ

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో అభివృద్ధి పనులకు గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి భూమి పూజ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, కాల్వలు, తాగునీటి పైపులైన్ పనులను చేపట్టినట్లు స్థానిక వార్డు కౌన్సెలర్ శివజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

September 4, 2025 / 06:08 PM IST

వైసీపీ నగర అధ్యక్షుడిపై మరో చీటింగ్ కేసు

NLR: నెల్లూరు వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్‌పై మరో చీటింగ్ కేసు నమోదైంది. ఓ ల్యాండ్ వ్యవహారంలో తన వద్ద నుంచి రూ.16 లక్షలు తీసుకున్నారని ప్రతిమ అనే మహిళ గురువారం చిన్న బజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఏటీఎం కార్డు ఉపయోగించి నగదు డ్రా చేశారనేది ఆరోపణ, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

September 4, 2025 / 06:06 PM IST

‘యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’

KRNL: ఆదోనిలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని, రైతుల కష్టాలను అర్థం చేసుకోవాలని డెమోక్రసీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ గురువారం ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులకు యూరియా పంపిణీ చేయాలని అయన డిమాండ్ చేశారు.

September 4, 2025 / 06:04 PM IST

మనమిత్రపై అవగాహన కార్యక్రమం

TPT: వాకాడు మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాట్సప్ గవర్నర్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించవలెనని ఎంపీడీవో శ్రీనివాసులు తెలియజేశారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీడీవో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ శనివారం పంచాయతీ కార్యదర్శులు, తప్పనిసరిగా ప్రజలకి అవగాహనా కల్పించాలన్నారు.

September 4, 2025 / 05:56 PM IST

‘MDU వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు తప్పనిసరి’

ELR: ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి తొలగించిన MDU వాహనాల యజమానులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ‘క్లాస్ ఆఫ్ వెహికల’ను మార్పించుకోవాలని జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ షేక్ కరీం సూచించారు. మొబైల్ క్యాంటీన్ నుంచి గూడ్స్ క్యారేజ్ మార్చాలని ఆయన తెలిపారు. జిల్లాలోని మొత్తం 24 వాహనాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు.

September 4, 2025 / 05:56 PM IST

పలు చోట్ల అన్నదానాలు

VSP: వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విశాఖలో 35వ వార్డులోని పలు ప్రాంతాల్లో అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఈ కార్యక్రమాలకు వార్డు అధ్యక్షుడు అలుపన కనకారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు వెలంపేట, సిహార్స్ జంక్షన్, ఆయిల్ మిల్ సందు వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను కనకారెడ్డి ప్రారంభించారు.

September 4, 2025 / 05:54 PM IST

‘అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలి’

PPM: బలిజిపేట మండలం అజ్జాడ పీఎసీఎస్ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. గురువారం అజ్జాడ పీఎసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని సర్పంచ్ అక్కెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరయ్యారు.

September 4, 2025 / 05:54 PM IST