ATP: గుంతకల్లు ఎస్కే పీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో, పాఠశాల, కళాశాలలో ఉపయోగించే నీటిని సహజ పద్ధతుల ద్వారా శుద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగించొద్దిని తెలిపారు.
KRNL: ఆదోని పట్టణ పరిధిలోని తిక్క స్వామి దర్గా ప్రాంతంలోని అంగనవాడీ కేంద్రం 85ను శుక్రవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , సీడీపీఓ ఢిల్లీ ఈశ్వరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, పీడీ విజయ పిల్లలు హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే పిల్లలుకు ఇస్తున్న ఆహరం, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ నందు సరుకుల నిలువ, కేంద్రం పరిశుభ్రతను తనిఖీ చేశారు.
ELR: సహకార సంఘ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సహకరించాలని సామాజిక కార్యకర్త శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన చాట్రాయి కోపరేటివ్ యూనియన్ బ్రాంచ్ కార్యాలయం వద్ద నూజివీడు నియోజకవర్గ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారికి సంఘీభావంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు
SKLM: మెలియాపుట్టి మండల ZPHSకు చెందిన వీ. జ్ఞాన సాయి ఉన్నత ప్రతిభ కనబరిచారు. జ్ఞాన సాయి అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో శిక్షణ పొంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లడక్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు 1,2లు యస్. దేవేంద్రరావు, ఎం. పద్మనాభం,పాఠశాల H.M గీత, ఉపాధ్యాయులు జ్ఞాన సాయిని ఘనంగా సత్కరించారు.
విశాఖలోని ICAR-CMFRI రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజనులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్య సంపద ద్వారా ఆదాయం పెంపు, జలాశయాలు–చెరువుల శాస్త్రీయ వినియోగంపై శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మత్స్య సంపద, ఆక్వాకల్చర్ అభివృద్ధికి అవసరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
BPT: కర్లపాలెం మండలం పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్యానెల్ లాయర్ దగ్గుమల్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తికాకుండా వివాహం చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.
అన్నమయ్య: మహాశివరాత్రి సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని గుండాలకోన, చిట్వేల్ మండలంలోని ఎండ్రకాయ కోనలో అటవీ శాఖ అధికారులు సేవలందించారు. వీరితో పాటు కోడూరు సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు ప్రతిభ చూపడంతో రేణిగుంట DSP శ్రీనివాసరావు విశిష్ట ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా సేవలందించినందుకు ప్రశంసించారు.
TPT: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి SBI తిరుపతి రీజనల్ కార్యాలయం సీఎస్ఆర్ నిధులతో శుక్రవారం వైద్య పరికరాలు అందజేసింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో స్టేట్ బ్యాంక్ ముందుంటుందని చెప్పారు.
PPM: గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న “ఫీడర్ అంబులెన్స్” సర్వీస్ల టెండర్ రెన్యువల్ చేయాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేశారు. శుక్రవారం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన గిరి శిఖర గ్రామాల నుంచి గర్భిణీలు, రోగులను PHCకు తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు.
CTR: ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. పుంగనూరులోని అగ్నిమాపక కార్యాలయంలో శుక్రవారం ఆయన కేసి టీవీతో మాట్లాడారు. వేసవి ఎండలు ప్రారంభమవుతున్నాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు జరిగితే 08581-253101 సమాచారం ఇవ్వాలన్నారు.
VZM: రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డా. వై కళ్యాణ్ చక్రవర్తి పోలియో నిర్మూలనే రోటరీ ధ్యేయమని శుక్రవారం తెలిపారు. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టి బొబ్బిలిలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశాన్ని 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించారని, దీనిపై అప్రమత్తత అవసరమన్నారు. అనంతరం క్లబ్ కార్యక్రమాలు సమీక్షించి రోటరీ బస్ బే ప్రారంభించి, విద్యార్థులకు టీ షర్టులు పంచారు.
KDP: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎస్సై హారిక అన్నారు. శుక్రవారం సిద్ధవటం పోలీస్ స్టేషన్ వద్ద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాల్యవివాహా విముక్తి ప్రచార రథాన్ని ఎస్సై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలకు బాల్య వయసులో వివాహాలు చేయడం పట్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు.
NLR: దగదర్తి మండలం పెదపుతేడు గ్రామంలో పంట నమోదు కార్యక్రమంను సీహెచ్ నాగరాజు సహాయ వ్యవసాయ సంచాలకులు కావలి శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు కార్యక్రమంలో నమోదవ్వాలన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పంట అమ్ముకోవచ్చన్నారు. ప్రభుత్వం ద్వారా లభించే ఇన్పుట్ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ పథకాలన్నిటికీ అర్హులవుతారని ఆయన తెలిపారు.
E.G: కడియం మండలం మాధవ రాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై నిందలు వేస్తే సహించేది లేదని ఆ గ్రామానికి చెందిన SC, ST ఐక్యవేదిక నాయకులు శుక్రవారం హెచ్చరించారు. చైతన్యనగర్లో తలెత్తిన భూ వివాదం ఆయన వ్యక్తిగతం కాదన్నారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు సర్పంచ్పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలవురు నాయకులు పాల్గొన్నారు.
ATP: అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం భూసేకరణ, భూమి బదలాయింపు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో కలిసి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిని ఆయన చర్చించారు. పెండింగ్లో ఉన్న భూమి బదలాయింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.