TPT: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయడు, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ను మర్యదపూర్వకంగా కలిసారు. మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై అచ్చెన్నాయడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. త్వరితగతిన మిగిలిన రూ.645 కోట్లు కేంద్ర వాటా విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు విడుదలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
CTR: సదుంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి ఆయన సూచించారు. పలువురు తమ సమస్యలు విన్నవించగా, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
PPM: విజయనగరం తోటపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ వాది, బహుజననాయకులు బోక ఆంజనేయులు ఆదివారం విజయవాడజై భీమ్ రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై బీమ్ పార్టీలో చేరారు. ఏపీ రాష్ట్ర జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్, విజయనగరం జిల్లా ఇంచార్జ్ దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
CTR: తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ అందరికీ ఆదర్శమని వెల్లడించారు.
కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్కు ఆదివారం విజయవాడ, బాపట్ల, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకుల తాకిడితో బీచ్ కళకళలాడింది. పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు.
KRNL: గోనేగండ్ల మం. గంజహళ్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీ సద్గురు బడేసాహెబ్ ఉరుసు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవాళ DSPభార్గవి, CI చంద్రబాబు, ఎమ్మిగనూరు టౌన్ CI శ్రీనివాసులు సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. దర్గా పరిసరాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా దృష్ట్యా 146మంది సిబ్బంది పాల్గొంటారు.
E.G: పెరవలి మండలం కాకరపర్రు గ్రామం నందు శ్రీ ఆదివారం జరిగిన గంటాలమ్మ దేవి అమ్మవారి వాయ ప్రతిష్ట మహోత్సవాలలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు మంత్రి సూచించారు.
బాపట్ల: జిల్లాలో నూతన టీడీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం లాంఛనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు కూడా ఈ భూమిపూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
సత్యసాయి: వైసీపీ నేతలకు హిందూ మతంపై నమ్మకం లేదని, వారిది కపట ప్రేమ అని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎం.ఎస్.రాజు విమర్శించారు. శాసనమండలిలో చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని అపచారం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో లడ్డూ కల్తీ, తలనీలాల అక్రమాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఎమ్మెల్యే ఆరోపించారు.
KRNL: దిబ్బనకల్ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి సంపును సర్పంచ్ పెద్దలక్ష్మి, టిడిపి నాయకులు లక్ష్మన్న ఇవాళ ప్రారంభించారు. దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యకు ఇది శాశ్వత పరిష్కారమని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సహకారం గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మద్దతుతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
KDP: ప్రొద్దుటూరు సమీపంలోని అమృత నగర్ ప్రభుత్వ కాలనీలో పేదల నివాసాల నుంచి అనధికార ప్రైవేట్ వెంచర్ సిరిపురి కాలనీకి తాగునీటి పైప్ లైన్ నిర్మిస్తున్న పనులను పంచాయతీ తీర్మాణం మేరకే చేపట్టినట్లు సర్పంచ్ శివచంద్రారెడ్డి తెలిపారు. అయితే, అమృతనగర్ వాసుల ఫిర్యాదు మేరకు పైప్ లైన్ పనులను నిలిపివేసినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహులు వెల్లడించారు.
SKLM: శ్రీకాకుళం పట్టణం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలింగుల సంక్షేమానికి రాజగోపాలరావు చేసిన సేవలు మరువలేమని రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం ఉత్తరాంధ్ర యూత్ ఇంచార్జ్ సంతోష్ తెలిపారు.
VSP: విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వివరించారు. సభ్యత్వ నమోదు విధానం, చేపట్టాల్సిన చర్యలపై ఇంచార్జిలకు సూచనలు ఇచ్చారు.
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఆదివారం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం నూతన జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ నాణ్యత గల జనరిక్ మందులు లభించే విధంగా భారతీయ జన ఔషధీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.