W.G: పాలకొల్లు శంభునిపేటలో ప్రాతః కాలంలో కొన్ని క్షణాలపాటు దృగ్విషంగా కనువిందు చేసిన ‘ఎర్రని సూరీడ్ని’ ఒకటో తరగతి చదువుతున్న వడ్డి గౌరీ శంకర్ అనే బుడతడు సెల్ ఫోన్లో బందించాడు. ఆదివారం తల్లి శైలజతో కలిసి వాకింగ్ చేస్తుండగా తల్లి చేతిలోని సెల్ఫోన్ తీసుకుని క్లిక్ మనిపించాడు. ఈ ఫోటోని వీక్షించిన వారందరూ గౌరీ శంకర్ ఫోటోగ్రఫీ ప్రతిభను ఔరా అంటూ మెచుకుంటున్నారు.
ATP: గుంతకల్లోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు.
NLR: అల్లూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లిని ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించారు. గ్రామదేవతల ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
E.G: వైసీపీ ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ గౌరవాన్ని కాలరాసారనీ విమర్శించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అగౌరవపర్చారనీ పేర్కొన్నారు. ఈ అపచారానికి జగన్ లెంపలు వేసుకోవాలన్నారు.
అనకాపల్లి కలెక్టరేట్తో పాటు జిల్లాలో మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తమ అర్జీలను పంపించాలని సూచించారు.
KRNL: గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవానికి ఆదివారం ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీ.వి జయ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దర్గా వద్ద పీఠాధిపతులు ముస్లిం సంప్రదాయంలో స్వాగతం పలికి, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన వారికి టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
VZM: జిల్లా స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ చైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 25, 26వ తేదీలలో జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అన్నారు.
PPM: ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా తయారవ్వాలని జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం సుధారాణి తెలిపారు. ఆదివారం వీరఘట్టం మండలం తలవరం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలలో రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని పేర్కున్నారు.
W.G: తాడేపల్లిగూడెం కడగట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు ప్రారంభించారు. పోషకాహార లోపంతో కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
VZM: గరివిడిలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడి వేడిగా సాగింది. ఎంపీడీవో సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యూరియాపై రైతులు ఆందోళన చెందుతున్నారని, అధిక ధరలకు ప్రైవేట్ షాపులు అమ్ముతున్నారని ఆరోపించారు.
అన్నమయ్య: మదనపల్లెలో బాలికల వసతి గృహంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై.. పిల్లలందరికీ హ్యాపీ సండే పై వివరించి, ఆదివారం హ్యాపీ సండే ప్రాముఖ్యతను ఎమ్మెల్యే పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చారన్నారు.
E.G: నిడదవోలులో శ్రీరామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్తబృందం ఆధ్వర్యంలో ఆదివారం 53వ పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామాల అభివృద్ధికి అధికార యంత్రాంగం సహకరించాలన్నారు. అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచ్ లు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు.
CTR: రెట్టగుంట గ్రామంలోని శ్రీ సుందర వినాయకస్వామి ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, గురజాల చెన్నకేశవులు నాయుడు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆయనకు ఘన స్వాగతం పలికిపూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన GJM చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఆలయ అభివృద్ధికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
కడప: జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంఖస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు రాష్ట్ర,పార్లమెంట్ కమిటీ నేతలు, జిల్లా పార్టీ నాయకులు హాజరయ్యారు.