• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు’

BPT: చీరాల తుఫాను వల్ల నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లిందని MLA కొండయ్య అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు చోట్ల గండ్లు పడ్డాయని, ప్రస్తుతం తాత్కాలిక కల్వర్టులతో నెట్టుకొస్తున్నామని తెలిపారు. శాశ్వత కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు.

February 26, 2026 / 02:28 PM IST

పామూరు వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వీరస్వామి

ప్రకాశం: పామూరు పట్టణ వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షునిగా యాట వీరస్వామిను వైసీపీ అధిష్టానం నియమించారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దల నారాయణ యాదవ్‌కు, కృతజ్ఞతలు తెలిపారు. వీరాస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.

February 26, 2026 / 02:28 PM IST

ఇసుక మయంగా రోడ్లు.. ప్రజలు అవస్థలు

NLR: నెల్లూరులోని మనుమసిద్దినగర్ వద్ద రోడ్డుపై ఇసుక ఇబ్బందికరంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పనుల నిర్మాణానికి రోడ్డు పక్కన ఇసుక తోలారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై ఇసుక కనపడక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో రోడ్లకు అడ్డంగా పనులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వీటిని అరికట్టాలని కోరుతున్నారు.

February 26, 2026 / 02:24 PM IST

పెద్ద పులి దాడిలో రెండు ఆవులు బలి

పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా వివిధ గ్రామాల్లో పులి కనిపిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామ పరిసర ప్రాంతంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

February 26, 2026 / 02:23 PM IST

‘HIT TV’ కథనానికి స్పందన

PLD: నరసరావుపేటలో ఒంటరిగా కనిపించిన బాలుడి వివరాలు ‘HIT TV’లో వార్తగా రావడంతో తక్షణ స్పందన లభించింది. తమ బిడ్డ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ ఫిరోజ్ సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించగా, తమ బిడ్డ ఆచూకీ తెలిపిన పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 02:20 PM IST

గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:20 PM IST

‘పది పరీక్షలకు 17 రోజులు మాత్రమే’

AKP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం 17 రోజులే ఉందని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే డయల్ యువర్ టీచర్ ప్రోగ్రాం ప్రతిరోజు చేయడానికి సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి ఆరు గంటల నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు.

February 26, 2026 / 02:19 PM IST

సీనియర్ కమ్యూనిస్టుకి సీపీఐ ఘన నివాళులు

VSP: సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆర్.నల్లకన్ను మరణంపై సీపీఐ జిల్లా సమితి సంతాపం వ్యక్తం చేసింది. జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న జన్మించిన నల్లకన్ను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని తెలిపారు. బడుగు బలహీనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన నిజాయితీకి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.

February 26, 2026 / 02:18 PM IST

217 మంది విద్యార్థులు గైర్హాజరు

AKP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.

February 26, 2026 / 02:17 PM IST

ఘనంగా ఎల్లమ్మ తల్లి ఉత్సవం

SKLM: దైవచింతన, సేవాభావం రెండు సమాజానికి అవసరమని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి అన్నారు. గురువారం పలాసలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 26, 2026 / 02:16 PM IST

గురుకులాల పాఠశాల ప్రవేశ పరీక్ష వాయిదా

NLR: గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

February 26, 2026 / 02:15 PM IST

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

VZM: గజపతినగరంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో జరిగింది. సభ్యత్వంతో జనసేన కుటుంబాలకు అండగా ఉంటూ బీమా చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందులో నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రపు సురేష్, మండల పార్టీ అధ్యక్షులు మునకాల జగన్నాధరావు, నీటి సంఘం నాయకులు తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, కృష్ణ పాల్గొన్నారు.

February 26, 2026 / 02:14 PM IST

బ్రాహ్మణచెరువులో NCD సర్వే

W.G: పెనుమంట్ర(మం) బ్రాహ్మణచెరువులో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ముమ్మరంగా NCD సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ.. గ్రామస్థులకు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.

February 26, 2026 / 02:13 PM IST

APRCETలో చిలుకూరికి 14వ ర్యాంక్

E.G: ఏపీ విద్యాశాఖ నిర్వహించిన APRCETలో కడియంకి చెందిన ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా 14వ ర్యాంక్ సాధించాడు. రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీహెచ్డీ సీట్లు భర్తీ చేసేందుకు 2025 నవంబర్‌లో APRCET పరీక్షలు జరిగాయి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి గురువారం ఫలితాలు వెల్లడించింది.

February 26, 2026 / 02:13 PM IST

MBU కిడ్నాప్ కేసులో కీలక మలుపు..!

TPT: తిరుపతి విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. పీఆర్వో సతీష్, బౌన్సర్ల నుంచి పోలీసులు కీలక సమాచారం, కాల్ డేటా సేకరించారు. ఎవరి ఆదేశాల మేరకు కిడ్నాప్ జరిగిందనే కోణంలో విచారణ సాగింది. నోటీసులు ఇచ్చినా మంచు విష్ణు ఇంకా విచారణకు రాలేదు. మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మార్చి 3కి వాయిదా పడటంతో ఉత్కంఠ నెలకొంది.

February 26, 2026 / 02:12 PM IST