గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) సహా 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలను రెండు నెలల్లో అమలు చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో భాగంగా సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.
దేశంలో జనాభా లెక్కించే విధానం ఇకపై పూర్తిగా డిజిటల్(digital) రూపంలోకి మారేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. అయితే ఈసారి డిజిటల్ విధానంలో 2024 మేలో వివరాల కోసం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.
ఎండలకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వీడటం లేదు.. మరి విద్యార్థుల గురించి ఆలోచించరా అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. జూన్ 12వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్కు లేఖ రాశారు.
ఆదిపురుష్(Adipurush) మూవీపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి(tirupati)లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమా దర్శకుడు, హీరోయిన్పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటివల ఆలయం ముందు డైరెక్టర్, హీరోయిన్ హగ్స్, ముద్దులు ఇచ్చుకోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించామని చెబుతున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారా అనే ప్రశ్న వస్తోంది.
రెండు కాన్పులో అమ్మాయిల(girl child)ను వద్దనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రెండో ప్రసవంలో పాపాయి జన్మిస్తే రూ.6 వేల సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. మిషన్ శక్తి స్కీమ్ లో భాగంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇంచార్జీలు కలిసి రావడం లేదా..? అని మీడియా ప్రతినిధి విజయవాడి ఎంపీ కేశినేని నానిని ప్రశ్నించగా భగ్గుమన్నారు. ఇంచార్జీ అనేది రాజ్యాంగ బద్ద పదవీ కాదన్నారు. సామంత రాజు, రాజులు , రారాజులు ఎవరూ ఇక్కడ లేరన్నారు. ఇంచార్జీలు ఎవరు గొట్టంగాళ్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.