• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రహదారి వ్యవస్థను నిర్వీర్యం చేశారు’

E.G: గత వైసీపీ ప్రభుత్వం రహదారి వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, కూటమి ప్రభుత్వం దాన్ని గాడిలో పెడుతోందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం అసెంబ్లీలో అన్నారు. బడ్జెట్లో రూ.9,014 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి కడియం, జొన్నాడ వెళ్లే రోడ్ల పనులు వేగవంతం చేయాలని కోరారు

February 26, 2026 / 08:48 AM IST

మార్కాపురం విద్యార్ధినిని అభినందించిన సీఎం

ప్రకాశం: మార్కాపురంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రం అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు సీఎం చంద్రబాబు వివరించారు.

February 26, 2026 / 08:45 AM IST

నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు

ASR: నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.30 గంటలకు మలికిపురం గాంధీ బొమ్మల సెంటర్ నందు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బొడసకుర్రు BRK రాజు ఫంక్షన్ హాల్ నందు జరుగు పార్లమెంటరీ స్థాయి జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం లో పాల్గొంటారు.

February 26, 2026 / 08:44 AM IST

బాపట్లలో పోలీసుల ‘డ్రగ్స్ వద్దు బ్రో’ ప్రచారం

BPT: మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా బాపట్ల పాత బస్టాండ్ వద్ద పోలీసులు బుధవారం సాయంత్రం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాంబాబు ఆటో డ్రైవర్లతో మాట్లాడి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం ఆటోలకు కరపత్రాలు అంటించి ప్రచారం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.

February 26, 2026 / 08:40 AM IST

ఇద్దరి మరణానికి కారణమైన లారీనీ పట్టుకున్న పోలీసులు

VZM: గత నెల 25న రామభద్రపురం వద్ద ఇద్దరి మరణానికీ కారణమైన లారీని స్దానిక SI ప్రసాదరావు బుధవారం పట్టుకున్నారు. యాత వీధికి చెందిన ఇరువురిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వాహనం కోసం గాలిస్తే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన స్వస్తిక్‌ మినరల్స్‌ లారీగా తేలింది. డ్రైవర్‌ ప్రమాదం తర్వాత లారిని కంపెనీకి అప్పగించి పారిపోయాడు. ఈ మేరకు లారీని ఛత్తీస్‌గఢ్‌ నుంచి తీసుకువచ్చారు.

February 26, 2026 / 08:40 AM IST

పలు కిరాణా దుకాణాలను తనిఖీ చేసిన కమిషనర్

ATP: గుంతకల్లులోని పలు కిరాణా దుకాణాలను గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అకస్మికంగా తనిఖీ చేశారు. మామజి అనే కిరాణా దుకాణ యజమానికి ప్లాస్టిక్ వినియోగిస్తుండడంతో రూ.2000 జరిమానా విధించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 26, 2026 / 08:36 AM IST

మొగల్తూరు అదనపు ఏఎస్సై ఎవరు.?

W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల తీవ్రత, కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, దీనిని ఒక ‘హెవీ క్రైమ్’ స్టేషన్ గా పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల త్వరితగతిన దర్యాప్తు కోసం ఖాళీ అయిన అదనపు ఎస్సై స్థానంలో ఉన్నత అధికారులు మరొక ఎస్సై త్వరలోనే నియమించే అవకాశం ఉంది. కాగా ఇక్కడ పని చేసిన ఎస్సై నాగలక్ష్మి ఇటీవల బదిలీ అయ్యారు.

February 26, 2026 / 08:33 AM IST

‘సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

E.G: కొవ్వూరు మండలంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవంతో పాటు భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లభిస్తుందని మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు తెలిపారు.జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

February 26, 2026 / 08:30 AM IST

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిపై హత్యాయత్నం

KRNL: MRPS జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాదిగపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బుధవారం వెల్దుర్తి మండలం కలుగొట్ల నుంచి ఉయ్యాలవాడ వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు స్కార్పియో వాహనంతో వెంటాడి ఇనుప రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు, ఉయ్యాలవాడలో ఉన్న ఒక దుకాణంలో వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నట్లు స్థానికులు తెలిపారు.

February 26, 2026 / 08:30 AM IST

కోడి పందాల స్తావరంపై దాడి..ఆరుగురు అరెస్ట్

ELR: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు-సరిపల్లి గ్రామాల మధ్య హుకుంపేట చెరువు సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఏడు మోటార్ బైక్‌లు, మూడు కోడిపుంజులు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.

February 26, 2026 / 08:30 AM IST

కాశీబుగ్గ డీఎస్పీ బదిలీ

SKLM: పలాస కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహ బాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. డీఎస్పీను తక్షణమే విధులు నుంచి రిలీవ్‌ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా బుధవారం ఆదేశించారు. ఈయన స్థానంలో ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీగా ఎవరిని నియమిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 08:30 AM IST

జిల్లాలో RDOల బదిలీ

CTR: కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది.

February 26, 2026 / 08:27 AM IST

అల్లూరు గ్రామంలో దొంగతనం

NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో దొంగతనం జరిగినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. గ్రామానికి చెందిన మద్దిలేటి సోమవారం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి వచ్చేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 తులాల వెండి, అర తులం బంగారం,15 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 08:26 AM IST

టీడీపీలో చేరిన వైసీపీ నేత రామకోటచారికి

NTR: తిరువూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రామడుగు రామకోటచారి బుధవారం టీడీపీలో చేరారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేసినేని చిన్ని రామకోటచారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ శివనాథ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో సుమచిత గుర్తింపు ఉంటుందన్నారు.

February 26, 2026 / 08:22 AM IST

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

PLD: రొంపిచర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న యున్న అభయాంజనేయ స్వామికి గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. 31వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను అర్చకులు కృష్ణమాచార్యులు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలు పొంగళ్లు నిర్వహించి, మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు.

February 26, 2026 / 08:18 AM IST