CTR: చెరువులకు గ్రావిటీ ద్వారా నీరు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అసెంబ్లీలో బుధవారం కోరారు. పశ్చిమ ప్రాంతాలలో కరువును తీర్చేందుకు హంద్రీనీవా జలాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కుప్పానికి వెళ్తున్న నీరు పలమనేరు నియోజకవర్గంలోని పలు చెరువులకు చేరుతున్నట్టు ఆయన చెప్పారు.
గుంటూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్కి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఘన స్వాగతం పలికారు. చినకొండ్రుపాడులో నిర్వహించిన ప్రైవేట్ వైద్య కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ని కలెక్టర్ పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
VZM: తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబినాయన కోరారు. వైసీపీ హయాంలో PR రోడ్లను R&Bలో విలీనం చేసినా నిధులకు ప్రతిపాదనలు చేయలేదన్నారు. పణుకువలస జంక్షన్ నుంచి వంతరాం రోడ్డుకు రూ.3కోట్లతో ప్రతిపాదనలు చేశామని నిధులు మంజూరు చేయాలన్నారు.
కృష్ణా: మచిలీపట్నం–పెడన NH216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు బుధవారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించి, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు తక్షణమే నంబర్ ప్లేట్లు అమర్చేలా చర్యలు తీసుకున్నారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
E.G: అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ సూచించారు. బుధవారం రాజమండ్రి జీజీహెచ్ సమీపంలోని అన్న క్యాంటీన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా.? అని ప్రశ్నించారు. ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
CTR: పుంగనూరు పురపాలక కార్యాలయంలో రేపు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్టు, బస్టాండులోనికి వచ్చు ప్రవేటు వాహన దారుల నుంచి ఫీజు వసూలు, PMC బస్టాండ్, పబ్లిక్ యూరినల్స్ మొదలగు వాటికీ వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మరణించింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద విడుదలైన నిధులతో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. టీడీపీ నాయకుడు బీపీ ఈరన్న కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
NDL: భారత్–జర్మనీ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి నియమితులయ్యారు. దీంతో ఆమె మరోసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎంపీ మాట్లాడుతూ.. రెండు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
BPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధవారం గౌతం గ్రాండ్ హోటల్లో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ సమన్వయకర్త పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.
GNTR: రాజధాని అమరావతిలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధుల బృందం బుధవారం కూడా పర్యటించింది. తాడేపల్లి మండలం ఉండవల్లి పంప్ హౌస్ వద్ద పనుల పురోగతిని సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు వారికి క్షుణ్ణంగా వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై ఏడీబీ అధికారులు ఈ పర్యటన ద్వారా పూర్తి అవగాహన చేసుకున్నారు.
NDL: మహానందిలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై బుధవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. MPHEO హుస్సేన్ రెడ్డి, తదితరులు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలను సేకరించారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజలు సర్వేకు సహకరించాలని అధికారులు కోరారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో మహిళపై ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. మండలంలోని వంగపాడు గ్రామానికి చెందిన హేమలత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాళ్లతో దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. గాయపడ్డ మహిళను స్థానికులు వెంటనే కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కృషితో దశాబ్దాల నాటి బ్రిడ్జి కల సాకారమవుతోంది. కన్నెపల్లి నుంచి భూపసముద్రం మధ్య హగరి నదిపై రూ.30 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏడు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
SKLM: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సంఘం పిలుపుమేరకు అన్ని తాలూకా కేంద్రాలలో ఈనెల 26, 27 తేదీలలో ధర్నా నిర్వహించిన ప్రధాన కార్యదర్శి తిరుమలరావు, అధ్యక్షులు శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12వ PRC కమిషన్ను నియమించాలి, 30% ఐఆర్ను ప్రకటించాలి, నాలుగు విడతల పెండింగ్ డిఏలను ప్రకటించాలన్నారు.