• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చెక్కు బౌన్సు కేసులో ఆరునెలల జైలు

TPT: ఏడు చెక్కు బౌన్సు కేసుల్లో బెంగళూరుకు చెందిన డా. సోమసుందర్‌ రెడ్డికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిప్ కోర్టు న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. డా. బి.చంద్రపాణి వద్ద రూ.31.37 లక్షలు అప్పు తీసుకుని జారీ చేసిన ఏడు చెక్కులు బౌన్సు కావడంతో కేసులు నమోదయ్యాయి.

March 4, 2026 / 07:44 AM IST

జనవాసాల మధ్యకు వచ్చేస్తున్న జింకలు

VSP: నగరంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వన్యప్రాణులు దారి తప్పుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం విశాలాక్షినగర్ నివాస ప్రాంతంలో ఒక అడవి జింక సంచరించింది. కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం నుంచి ఆహారం, నీటి కోసం ఇవి జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జింకలు, దుప్పులు వీధి కుక్కల దాడులు, వాహన ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్దున్నారు.

March 4, 2026 / 07:43 AM IST

రేపటి నుంచే సీతారాముల డోలా మహోత్సవాలు

VZM: సంతకవిటి మండలంలోని గుళ్ళ సీతారామపురంలో 500 ఏళ్ల చరిత్ర గల సీతారాముల డోలా మహోత్సవం మార్చి 5-7 తేదీల్లో జరుగుతుందని ఈవో మాధవరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఫాల్గున శుద్ధ ఏకాదశి బదులుగా 5 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకుడు బోగాపురుపు ప్రసాదు చెప్పారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ రావు రవీంద్ర తెలిపారు.

March 4, 2026 / 07:40 AM IST

జూద శిబిరంపై దాడి.. రూ.1,10,690 స్వాధీనం

కృష్ణా: పెనమలూరు పోలీసులు కానూరులో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆటోనగర్‌లో కొందరు కోతముక్కలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీ చేసి, 9 మంది జూదం ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,10,690ల నగదు, పేకముక్కలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 4, 2026 / 07:38 AM IST

మట్టిరోడ్డుపై నిత్య పోరాటం

VZM: సంతకవిటి మండలం మల్లయ్యపేట-హొంజరాం మట్టి రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. ఈ మార్గంలోనే చింతలపేట, మల్లయ్యపేట, మంతిన, రామ రాయపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

March 4, 2026 / 07:36 AM IST

గుడారాల పండుగకు ప్రత్యేక రైళ్లు

GNTR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుడారాల పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మార్చి 5 నుంచి 8 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ పోర్ట్-విజయవాడ, విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పండగ ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.

March 4, 2026 / 07:35 AM IST

ఉమ్మడి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా అమర్నాథ్

ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 07:34 AM IST

అరుణాచలం తరహాలో నేడు దేవరకొండ గిరిప్రదక్షిణ

ATP: అరుణాచలం తరహాలో బుక్కరాయసముద్రం దేవరకొండ చుట్టూ వేంకటరమణ స్వామి గిరిప్రదక్షిణకు ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి సందర్బంగా నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దాతల సహకారంతో కొండ చుట్టూ రహదారి, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ సమయంలో స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగిస్తారు.

March 4, 2026 / 07:34 AM IST

నేడు జిల్లాకు ఒడిశా గవర్నర్

VZM: ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం కొత్తవలస మండలం మంగళపాలెం రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం ఆసుపత్రిని సందర్శిస్తారు. రాష్ట్ర గవర్నర్ రానుండడంతో పోలీస్ భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.

March 4, 2026 / 07:34 AM IST

పాలసముద్రం మండలంలో అడవి పందుల బెడద

CTR: పాలసముద్రం మండలంలో అడవి పందుల బెడద పెరిగింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలను పందులు ధ్వంసం చేస్తున్నాయి. 13 పంచాయతీల్లో ఒకో రైతు ఐదు ఎకరాల పంటలో మూడు ఎకరాల వరకు నష్టపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 07:30 AM IST

వృద్ధురాలిపై చాకుతో బెదిరించి దోపిడీ

కృష్ణా: చల్లపల్లి (M)లోని లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో మంగళవారం దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 78 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలోకి చొరబడ్డారు. చాకుతో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

March 4, 2026 / 07:30 AM IST

నేడు తిరుపతిలో ఉద్యోగ మేళా

TPT: తిరుపతిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ చదివిన వారు మేళాకు హాజరు కావాలని సూచించారు.  నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 4, 2026 / 07:27 AM IST

నేడు తిరుపతిలో జాబ్ మేళా

TPT: తిరుపతిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ చదివిన వారు మేళాకు హాజరు కావాలని సూచించారు.  నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 4, 2026 / 07:27 AM IST

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఆత్మకూరు సీఐ

NDL: కారులో ప్రయాణించేవారు సీటుబెల్టు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆత్మకూరు సీఐ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం తాగి, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమన్నారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 4, 2026 / 07:24 AM IST

జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొడ్డేడ ప్రసాద్

అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొడేడ ప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రసాద్ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 4, 2026 / 07:22 AM IST