KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.
KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.
KRNL: పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామ శివారులో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో సజ్జలు నూర్పిడి పట్టే యంత్రంలో ప్రమాదవశాత్తు దొడ్డనగేరి గ్రామానికి చెందిన వ్యక్తి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. యంత్రంలో చిక్కుకోవడంతో మృతుడి శరీరం గుర్తుపట్టలేనంతగా చిద్రమైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: చిన్నమండెం బస్టాండ్లో రూ. 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.
W.G. భీమవరంలో మంగళవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు.
బొబ్బిలి పట్టణ సీఐ కె. నారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, మత్తు పానీయాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చదువుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలు వివరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ELR: దెందులూరు నియోజకవర్గం లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
NDL: రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ బనగానపల్లె మండలంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దరాజుపాలెం, చెర్లకొత్తూరు గ్రామాల్లో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్ కార్యాలయం వెల్లడించింది.
తూ.గో: నిడదవోలు రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు చింతల బాలాజీ నేతృత్వంలో మంగళవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరై ప్రశిక్షణ ప్రాధాన్యతను వివరించారు. బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
తూ.గో: నిడదవోలు రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు చింతల బాలాజీ నేతృత్వంలో మంగళవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరై ప్రశిక్షణ ప్రాధాన్యతను వివరించారు. బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
GNTR: ప్రభుత్వం ఉగాది పర్వదినాన అందజేసే ప్రతిష్ఠాత్మక ‘కళారత్న’, ఉగాది పురస్కారాల మొమెంటోలను తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అద్భుతంగా రూపొందించారు. ఈ మొమెంటోలను సీఎం చంద్రబాబు గ్రహీతలకు అందజేయనున్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో వీటిని సందర్శించిన తహసీల్దార్ గోపాలకృష్ణ, తెనాలి కళాకారుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ లాస్ట్ మీటింగులోనూ రభస తప్పలేదు. మంగళవారం ఛైర్ పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. తాను సూచించిన ప్రాధాన్యత కలిగిన అంశాలను అజెండాలోకి తీసుకురాక పోవడంపై ఛైర్ పర్సన్ కమిషనర్ను నిలదీశారు. టేబుల్ అజెండాగా తేవాలని సమావేశాన్ని అరగంట వాయిదా వేశారు.
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన రైతులకు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సమకూరిన లబ్ధిపై రైతులకు మంగళవారం టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ నరసప్ప, సీఈవో నరసింహామూర్తి, టీడీపీ గ్రామ అధ్యక్షులు నరసింహులు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇచ్చిందన్నారు.
NDL: సంజామల మండలం ముదిగేడులో మంగళవారం వ్యవసాయ సహాయకురాలు సుమ పరిమళ, ఎంపీఈఓ వేణు గోపాల్ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో సాగు విధానాలపై, వ్యవసాయాభివృద్ధికి ఊతమిచ్చే పంచసూత్రాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. పశుసంవర్ధక కార్యదర్శి మహబూబ్ బేగ్, టీడీపీ నేత రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
కాకినాడ: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలోని ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.