• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంపై జీవో‌పై హర్షం

E.G: ఇంద్రధనస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం జీవో 21 జారీ చేయడం పట్ల బిక్కవోలు బీజేపీ నాయకుడు చేవ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామకృష్ణారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

March 3, 2026 / 04:19 AM IST

హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రూ.50 లక్షలతో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి మండల పెద్దలు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

March 2, 2026 / 10:00 PM IST

ఆకివీడు హైస్కూల్‌ను సందర్శించిన హేమ జైశ్వాల్

W.G: ఆకివీడు PLS హైస్కూల్లో ఎంఈవోలు, హెడ్మాస్టర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పీఎం శ్రీ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ హేమ జైశ్వాల్ సోమవారం హాజరయ్యారు. అదనపు బోధన వనరులు ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఆమె పీఎంశ్రీ నిధులతో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను పరిశీలించారు. కలెక్టర్ CH.నాగరాణి మాట్లాడుతూ.. పీఎంశ్రీ జాతీయ స్థాయిలో విద్యా నాణ్యతను మెరుగుపర్చేది అన్నారు.

March 2, 2026 / 10:00 PM IST

‘నాటుసార కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చర్యలు’

KRNL: నాటుసారా విక్రయించే కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసార కుటుంబాల పునరావాస వ్యూహం, కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి అల్ఫోన్స్, ఎక్సైజ్ ఈఎస్ రవికుమార్ పాల్గొన్నారు.

March 2, 2026 / 09:36 PM IST

పాలకొల్లులో బాణసంచా కేంద్రాల్లో తనిఖీలు

W.G: వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీపేలుడు దుర్ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో పాలకొల్లులోని బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో సీఐ రజనికుమార్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. తయారీ, విక్రయ కేంద్రాలు ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ నిబంధనలు పాటిస్తున్నాయా, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

March 2, 2026 / 09:33 PM IST

వైసీపీని వీడి టీడీపీలో చేరికలు

ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామంలో సోమవారం 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ అభివృద్ధికి కార్యకర్తలందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

March 2, 2026 / 09:30 PM IST

అక్రమంగా తరలిస్తున్న బియ్యం సీజ్

ఏలూరు రూరల్ మండలం తంగళ్ళమూడి పంచాయతీ పరిధిలోగల జాతీయ రహదారిపై అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సివిల్ సప్లై అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని 258 క్వింటాళ్ల రేషన్ బియ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వాహన యజమాని మరియు డ్రైవర్ పై కేసు నమోదు చేసామన్నారు.

March 2, 2026 / 09:05 PM IST

నిదానంపాటి అమ్మవారికి రూ.21.17 లక్షల ఆదాయం

PLD: దుర్గి మండలంలోని అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. గత 47 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. రూ.21,17,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కె. ఆదిశేష నాయుడు తెలిపారు. ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, దేవాదాయశాఖ ఇన్స్‌స్పెక్టర్ వి. లీలావతి పర్యవేక్షణలో లెక్కించారు.

March 2, 2026 / 09:00 PM IST

పొందూరు ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ

SKLM: పొందూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక పరికరాలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

March 2, 2026 / 08:56 PM IST

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: సీఐ

కోనసీమ: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు సీఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం రాజోలులో ఆయన తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి నుంచి జరిమానాలు వసూలు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధం అని, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సీఐ అన్నారు.

March 2, 2026 / 08:49 PM IST

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు

VZM: జిల్లాలోని పలు బాణాసంచా తయారీ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ఉమ్మడి తనిఖీలు నిర్వహించింది. బాడంగి, గుర్ల, చీపురుపల్లిలో ఈ తనిఖీలు జరిగాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్, ఎక్స్‌ప్లోజివ్ కంట్రోలర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.

March 2, 2026 / 08:46 PM IST

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

ELR: రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. హనుమాన్ నగర్ వంతెన వద్ద పట్టాలు దాటుతున్న కుప్పాల లీలా కుమార్ (45)ను రైలు ఢీకొంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. రైల్వే ఎస్సై దానం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

March 2, 2026 / 08:45 PM IST

మంత్రి కృషితో పిట్టల వేమవరానికి సీసీ రోడ్డు మంజూరు

E.G: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ చొరవతో కీలక మౌలిక సదుపాయాల పనులకు మోక్షం లభించింది. యర్రాయిచెరువు – పిట్టల వేమవరం వరకు నిర్మించ తలపెట్టిన 1.1 కి.మీ సీసీ రోడ్డుకు కూటమి ప్రభుత్వం రూ.1.30 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు.

March 2, 2026 / 08:40 PM IST

విశాఖలో అడుగుపెట్టిన అథ్లెట్

VSP: యువతకు స్ఫూర్తినిస్తూ భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన “వన్ ఇండియా రన్” సోమవారం విశాఖ చేరుకుంది. దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పరుగు ద్వారా సమాజ సేవ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ పరుగు ద్వారా ఉదయాన్ ఫౌండేషన్ కోసం రూ.60 లక్షలు సేకరించనున్నట్లు చెప్పారు.

March 2, 2026 / 08:37 PM IST

ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: జేసీ

ATP: జిల్లాకు కేటాయించిన హౌసింగ్ లక్ష్యాన్ని ఉగాది నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16,702 ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల బిల్లుల నమోదు చేయాలని సూచించారు.

March 2, 2026 / 08:34 PM IST