• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారు: మాజీ ఎంపీ

కోనసీమ: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అమలాపురం మాజీ ఎంపీ చింత అనురాధ పేర్కొన్నారు. చలో విజయవాడ” పిలుపుతో ధర్నా చౌక్‌లో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించాలన్నారు. అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.

March 3, 2026 / 08:11 PM IST

జిల్లా జెఏసీ-కో ఛైర్మన్‌ నియామకం

VZM: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జిల్లా ఐక్యవేదిక జేఏసీ కో ఛైర్మన్‌గా PRTU జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్ర నాయుడు మంగళవారం నియామకం అయ్యారు. పీఆర్సీ, డీఏలు, ఎర్నాడ్ లీవ్, ఎన్కాష్మెంట్ ఇతర ఆర్థిక పరమైన విషయాలపై భవిష్యత్తులో పోరాటాలకు పనిచేస్తామని తెలిపారు. ఇవాళ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

March 3, 2026 / 08:11 PM IST

ఆత్మకూరులో మున్సిపల్ స్థలంపై కబ్జా యత్నం

NDL: ఆత్మకూరులో మున్సిపాలిటీకి చెందిన కూరగాయల సంత మార్కెట్ స్థలంపై కబ్జా యత్నం జరిగింది. రక్షణగా ఉన్న ప్రహరీ గోడను అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కూల్చివేశారు. దీంతో మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకుని వెంటనే గోడ పునర్నిర్మించాలని ప్రజలు మున్సిపల్ కమిషనర్‌ను కోరుతున్నారు.

March 3, 2026 / 08:10 PM IST

ఇరాన్‌పై మారణకాండ ఆపాలి: ఐఎఫ్టీయూ

ATP: అమెరికా, ఇజ్రాయిల్ మరణకాండకు నిరసనగా అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. 7 శతాబ్దాలుగా ప్రపంచంలో జరిగే యుద్ధాలు మరణకాండకు మూల కారణం అమెరికా దేశమని వారు పేర్కొన్నారు. ఇరాన్‌పై మారణకాండ ఆపాలన్నారు.

March 3, 2026 / 08:09 PM IST

6న ఎమ్మెల్యే బాలకృష్ణ ఇఫ్తార్ విందు

సత్యసాయి: ​హిందూపురం పట్టణంలోని ఆల్ హిలాల్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 6న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ ఛైర్ పర్సన్ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులందరికీ ఆహ్వాన లేఖలు పంపి, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

March 3, 2026 / 08:04 PM IST

శివశంకర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రం

ATP: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం నార్పల గ్రామానికి చెందిన గవ్వల శివశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణులకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం సన్మానించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శివశంకర్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.

March 3, 2026 / 07:59 PM IST

జిల్లా బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్‌గా చక్ర రమేశ్

KKD: కాకినాడ బీజేపీ జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్‌గా చక్ర రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చాటిచెప్పాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని రమేశ్‌కు ఆయన సూచించారు.

March 3, 2026 / 07:55 PM IST

చిత్తూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

CTR: జిల్లా అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, పోలీసులు వాహన పత్రాలు, లైసెన్స్‌లు, హెల్మెట్ వాడకం, మద్యం తాగి వాహనాలు నడపడాన్ని తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా, ప్రజా భద్రతను, నేరాలను నిరోధించడానికి ఇంటెన్సివ్ వెహికల్ చెక్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.

March 3, 2026 / 07:53 PM IST

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

మార్కాపురంలోని కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదిలి మండలం కుంచెపల్లి గ్రామానికి చెందిన వరికుంట్ల పౌలు, వరికుంట్ల వినోద్ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 3, 2026 / 07:52 PM IST

సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

GNTR: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరిగిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.

March 3, 2026 / 07:51 PM IST

జిల్లాలో 15 మందికి బెస్ట్ టీచర్ అవార్డులు

ఏలూరు జిల్లా బయాలజీ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన 15 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానించారు. జిల్లా ఉమ్మడి పబ్లిక్ పరీక్షల కార్యదర్శి సర్వేశ్వరరావు పాల్గొని బయాలజీ ఫోరం విశిష్టతలను వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.గంగాధర్ ఫోరం ఆవిర్భావం, సేవలను వివరించారు.

March 3, 2026 / 07:50 PM IST

కేంద్ర మంత్రితో ఎంపీ భేటీ

SKLM: ఎంపీ రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మందస పాతపట్నం స్టేషన్లలో పలు రైళ్లు నిలుపుదల కల్పించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.

March 3, 2026 / 07:47 PM IST

గోశాలను పరిశీలించిన జేఈవో

CTR: తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో డా. ఏ.శరత్ పలమనేరు గోశాలను మంగళవారం పరిశీలించారు. పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 450 ఎకరాల్లో విస్తరించిన గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నాయని తెలిపారు. పచ్చిమేత సాగును విస్తరించాలని, పరిశుభ్రత, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

March 3, 2026 / 07:45 PM IST

చందోలులో వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

BPT: చందోలులో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. జీర్ణోద్ధరణ చేసిన నూతన మండపంలో అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం వివాహ వేడుకను నిర్వహించారు. నిత్య హోమం, ప్రత్యేక పూజలతో పాటు గరుడసేవ, రథోత్సవం కనులపండువగా సాగాయి. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ సాయి గుప్తా, ఈఓ నరసింహమూర్తి వెల్లడించారు.

March 3, 2026 / 07:44 PM IST

జిల్లాకు రూ.736.27 కోట్ల నిధులు: ఎంపీ అంబిక

ATP: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, సెప్టేజ్ అభివృద్ధికి రూ.736.27కోట్ల నిధులు మంజూరైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అమృత్ 2.0, ఏఐఐబీ పథకాల కింద అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం పట్టణాల్లో పనులు చేపట్టనున్నారు. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయని, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:43 PM IST