ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు ఆర్డీటీ సంస్థపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని బహుజన రాజ్యాధికార జేఏసీ కమిటీ ఛైర్మన్ జై భీమ్ రామాంజినేయులు కోరారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ బైకులు, కార్లు, ఇంటి గోడల పైన ‘సేవ్ ఆర్డీటీ’ అని రాసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
కోనసీమ: న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో సత్తా చాటిన ద్రాక్షారామ విద్యార్ది కె.విష్ణు వర్ధన్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఏడవ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ ఒక స్వర్ణ, ఒక రజిత పథకాన్ని సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి విద్యార్థికి రూ.5 వేలు నగదు అందజేశారు.
VSP: పెట్టుబడుల పేరిట ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆరోపించారు. తర్లువాడలో విలువైన భూమిని 99 పైసలకే సంస్థకు ఇచ్చిన నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములను బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, నగర అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.
W.G: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి శాంతి ధామాన్ని మూసివేస్తున్నట్లు అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి పునర్దర్శనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు, ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్లు సోమవారం సాయంత్రం పరామర్శించారు. రూ.50 లక్షలు నష్టపరిహారం 5 ఎకరాలు భూమి ఇల్లు అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
VZM: హ్యాకథాన్ పోటీల్లో గెలుపొందిన ఇద్దరు సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్ధినులను జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కలెక్టరేట్లో సోమవారం అభినందించారు. విద్యార్థులు యాల యోగేశ్వరి, దాసరి తేజశ్వని హ్యాకథాన్ పోటీల్లో సత్తా చాటి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ ప్రోత్సహి...
VSP: మాజీ ఎంపీ, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సోమవారం అమరావతిలోని రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి గవర్నర్కు వివరించారు.
TPT: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 390 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని, పెండింగ్ లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
E.G: గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పర్యాటక రంగ అభివృద్ధి, భూసంబంధిత కోర్టు కేసులు, PGRS తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వార్షికోత్సవ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ బి. సుజాత ప్రారంభించారు. క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
CTR: మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద “కాణిపాకంలో అరుణోదయం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యే దేవస్థానం అభివృద్ధిలో గల్లా అరుణ కుమారి పాత్రను కొనియాడగా, ఆమె అభివృద్ధికి స్థలాలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని సూచించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, పార్టీలు- ప్రజాసంఘాలతో కలిసి రచ్చబండల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. రాయలసీమకు నష్టం జరగకుండా అందరూ కలిసిరావాలని కోరారు.
SKLM: సామాన్య ప్రజలకు వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం 29 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ.15 లక్షల చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం ఆర్ఎఫ్ ఎంతో ఉప యుక్తమని తెలిపారు.
W.G: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో రాయలం జనసైనికులు చూపుతున్న చొరవ అభినందనీయమని ఎమ్మెల్యే రామాంజనేయులు కొనియాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన రూ.2.65 లక్షల విరాళాన్ని సోమవారం ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ‘సేవ్ పునర్విక పోస్టర్ ను ఆవిష్కరించారు.
ASR: కొయ్యూరు మండల విద్యాశాఖ అధికారిగా పాటి సింహాచలం నియమితులయ్యారు. కొయ్యూరు మండలంలోని రావణాపల్లి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న సింహాచలం ఇటీవల పదోన్నతి పొందారు. ఈమేరకు, ఆయన సోమవారం కొయ్యూరు ఎంఈవోగా నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.