తెలుగుదేశం కేవలం ఓ పార్టీ మాత్రమే కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆ...
భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలక కేంద్రంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ లో వరుస ఆత్మహత్యలు అలజడి రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం విషాదం కలిగించింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో ఈ నెల 15, 16, 17వ తేదీల్లో రోజుకొకరు చొప్పున ముగ్గురు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. వివిధ కారణాలతో వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. అఘాయిత్యానికి ప...
విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ల విషయంలో చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. నాని సోదరుడు చిన్నికి విజయవాడ టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చిన్ని సహా మరో నలుగురికి టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని ఇటీవల నాని స్పష్టంచేశారు. ఓ సందర్భంలో విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగుతానని నాని సంకేతాలను ఇచ్చారు. అక్కడినుంచి తాను పోటీ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకట...
దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ 18 జనవరి 1996లో కన్నుమూశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు...
నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్నవాళ్లకు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇస్తే గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని అన్నారు. పశ్చిమలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ సరైన అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి 25వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెస్ట్లో ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాన్ని తాను చెప్పలేదన్నారు. భవిష్యత్తులో అన్ని డివిజన్లలో టీడీపీలోకి చేరి...
వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధమని ప్రముఖ సినీ నటుడు, ఆ పార్టీ నేత అలీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ పైన పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ… అది జగన్ అభిప్రాయం, మా ముఖ్యమంత్రి ఇక్కడి నుండి పోటీ చెయ్ అలీ అంటే నేను రెడీ అన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు […]
బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం చూశాక, తనకు వెళ్లాలనిపించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాలయ్య బాబుతో తాను ఏడు సినిమాలు చేశానని, అవన్నీ హిట్ సినిమాలేనని, కానీ రాజకీయాల్లో ఆయన థియరీనే సరైనది కాదన్నారు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు మృత్యువాత పడుతున్నా సభలకు అనుమతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. తనకు అన...
టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...
మంచివాడైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దుష్టుడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఏమాత్రం మంచిది కాదని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ప్రాంతీయతత్వాన్ని వదిలి, జాతీయ దృక్పథంతో ముందుకు సాగాలని పార్టీని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మార్చుకున్నారని, అలాంటి మహానాయకుడైన మీరు జగన్కు మద్దతుగా నిలువవద్దని కోరారు. రాష్ట్రంలోని ఓ వర్గం పవన్ కళ్...
టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కేశినేని శివనాథ్కు లోకసభ టిక్కెట్ ఇస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోను సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. అతనితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చినా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఎవరైనా పార్టీలో పని చేయవచ్చు… పోటీ కూడా చేయవచ్చునని, కానీ క్రిమినల్స్, ల్యాండ్, సెక్స్ మాఫియా గ్రూప్లకు టిక్కెట్లు ఇస్తే సహకరించే ప్రసక్తి లేదన...
చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేయడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం అన్నారు. పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పని అయిపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ప్రజలు తనకు బుద్ధి చెప్పడం కాదని,...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ప్రత్యేక బస్సు వారాహితో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. బస్సుకు 24వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని, అనంతరం ఆలయ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పనీ, ఆ పార్టీ పని అయిపోయిందని ఆయన అన్నారు. రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ శ్రేణుల పై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలు లో ఉంచారు. సోమవారం అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు సబ్ జైలులో ఉన్న [&hell...
2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...
ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...