కృష్ణా: న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాకేష్ లఖన్ నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే నెల 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
BPT: ఇసుకపల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ. 40 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు కేటాయించినట్లు టీడీపీ నేత శివప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన గురువారం భూమి పూజ నిర్వహించారు.
బాపట్ల జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి పొందిన పంగులూరి శ్రీనివాసరావు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు మంచి పేరు వచ్చేలా నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు కలెక్టర్ సూచించారు.
NDL: చాగలమర్రి మండలంలో పెద్దవంగలిలో శ్రీ హజరత్ సయ్యద్ షా దస్తగిరి స్వామి ఉరుసు ఉత్సవాలు మార్చి 1, 2న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. మార్చి 1న గంధం, 2న ఉరుసు నిర్వహించనున్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. ఉత్సవాల నిమిత్తం దర్గాను నిర్వాహకులు సుందరంగా అలంకరిస్తున్నారు.
W.G: వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి గురువారం వైసీపీలో చేరారు. నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామ్ మాట్లాడుతూ.. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి వస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
KRNL: ఆదోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నాలుగో రోజు సామూహిక దీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వేతనం పెంచి, గ్రాచుటీ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు గురువారం డిమాండ్ చేశారు. జీతాలు పెరుగేవరకు దశలవారీగా నిరసనలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు తెలిపారు.
అన్నమయ్య: రైల్వే కోడూరులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు టీడీపీ ప్రజా దర్బార్ కార్యక్రమం రేపు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు రాఘవరాజుపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. టీడీపీ పార్టీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రజలను స్వయంగా కలుసుకుని వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
KDP: రైతులందరూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ వెబ్సైట్ నమోదు చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ రామ శివ దీక్షిత్ సూచించారు. గురువారం వేముల మండలం పెర్నపాడులోని బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బుడ్డ శనగకు ప్రకటించిన మద్దతు ధరను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.
TPT: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం సర్వే నెం. 13లోని 1.9 ఎకరాల భూమి ఆక్రమణపై సీపీఎం ఆధ్వర్యంలో హతిరాంజీ మఠం ఎదుట ధర్నా నిర్వహించారు. 32 మంది పేదలు కొనుగోలు చేసిన భూమిని రామసుబ్బారెడ్డి ఆక్రమించాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మఠం అదనపు ఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
PPM: జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్టు సమాచారం తెలిస్తే జరిపించిన తల్లిదండ్రులతో పాటు గ్రామ సర్పంచ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్య వివాహాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
SKLM: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టిందని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గేదెల చైతన్య అన్నారు. శ్రీకాకుళంలో జనసేన సభ్యత్వ నమోదుకి గురువారం శ్రీకారం చుట్టారు. పార్టీని బలోపేతం చేసి నాయకత్వ బాధ్యతలు యువత చేపట్టాలన్నారు.
గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞాన ప్రదర్శనను గురువారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. ప్రదర్శన ఏర్పాటు పట్ల వైద్య కళాశాల ప్రిన్సిపాల్ను అభినందించారు. ఎంతో విజ్ఞానదయంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తిలకించదగినదని చెప్పారు. విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిస్తుందన్నారు.
అనంతపురం: అగ్రిగోల్డ్ బాధితులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం వసూళ్ల ప్రక్రియను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీకి చెల్లించే పన్నులు ప్రధాన ఆదాయ వనరులు అని ఎంపీడీవో తెలిపారు. గ్రామంలో శుభ్రత, వీధి దీపాలు,తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంటి పన్ను చెల్లించాలన్నారు.
ATP: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 20,855 మంది విద్యార్థులకు గాను 20,517 మంది హాజరుకాగా, 338 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా విభాగంలో 1,931 మందికి 1,901 మంది హాజరయ్యారని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు.