ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. అలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో APPSCలో కూడా స్కాంలు జరిగాయని గుర్తు చేశారు. అంతేకాదు అసలు ఏపీకి ఇప్పటివరకు రాజధాని కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ అనేక మంది హైదరాబాద్లోనే ఉంటున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పలువురికి హైదరాబాద్ కు రాకపోతే వారికి పూట కూడా గడవదని వ్యాఖ్యలు చేశారు.
మొబైల్లో ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడి ఓ బాలుడు ఓడిపోయాడు. ఆ ఓటమిని తట్టుకోలేక మతి తప్పాడు. ఈ ఘటన రాజస్థాన్లో గల అల్వార్లో జరిగింది.
పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. పవన్ పై సురేష్ అనే వాలంటీర్ ఫిర్యాదు మేరకు కృష్ణ లంక పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో అమ్మాయిల ట్రాఫికింగ్ విషయంలో వాలంటీర్ల పాత్ర ఉందని ఇటివల ఏలూరు వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణా విషయంలో వాలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించారు. దీంతో ఈ అంశంపై అక్కడి […]
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. మరికొంత మంది వారి మొక్కులను బట్టి పలురకాలుగా వెళ్లడం చూస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాజాగా నాట్యం చేస్తూ వెళ్లారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీ సీఎం జగన్పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
మదనపల్లెలో టమాటా రైతు దారుణ హత్య కలకలం రేపింది
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ మరోసారి రెచ్చిపోయారు
పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేం సమస్య అని సీఎం జగన్ను అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు భారతవాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలో 5 రోజులు, ఆంధ్రప్రదేశ్లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అన్ని ప్రైవేట్ కంపెనీల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ గురించి చేసిన కామెంట్లపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. అసలు భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణమని అన్నారు. పవన్ను అస్సలు సీఎం చేయరని, నిన్ను కూరలో తాలింపు మాదిరిగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉన్నాయి. ఏపీలో వాలంటరీ వ్యవస్థ చాలా ఉన్నతమైనది అంటున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
మీ అపార్ట్ మెంటులో వాచ్ మెన్ ఉన్నాడా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తాజాగా ఓ నేపాలీ వాచ్ మెన్ కుటుంబం(nepali watchman family) ఓ వ్యాపారి ఇంట్లో నుంచి 5 కోట్ల రూపాయల విలువైన నగదు, అభరణాలను దోచుకెళ్లారని తెలిసింది. ఈ ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని జగ్గయ్యపేట కార్యక్రమంలో స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. పలువురు నేతలు పరామర్శించారు.
తనకు ఏ ఆరోగ్య సమస్య లేదని మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. తన ఆరోగ్యం చెడిందని ఐ-టీడీపీ ప్రచారం చేసిందని విమర్శించారు.