KRNL: జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులు అమరావతికి బయలుదేరారు. 2,590 మంది రేపు సీఎం చంద్రబాబు చేతులమీదుగా నియామక పత్రాలు తీసుకోనున్నారు. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి 134 బస్సులను కలెక్టర్ ఏ. సిరి, డీఈవో శామ్యూల్ పాల్ ప్రారంభించారు. నూతన ఉపాధ్యా యులు రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులకు బోధించాలని కలెక్టర్ సూచించారు.