W.G: నరసాపురం మండలం లక్ష్మనేశ్వరంలో శనివారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులకు వ్యవసాయ యంత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.