E.G: తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.