W.G: పాలకొల్లు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) షేక్ జియోద్దీన్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్లో సివిల్, క్రిమినల్, బెంచ్ కేసులు మొత్తం 213 కేసులు రాజీ చేసారు. ఇందులో ఐపీసీ కేసులు -90, ఎక్సైజ్ కేసులు -32, ప్రామిసరీ నోట్ కేసులు -33, ఎగ్జిక్యూటివ్ పిటిషన్ కేసులు -3, ఫైనల్ డిక్రీ కేసు -1, పరిష్కారం అయినట్లు తెలిపారు.