VZM: కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న కోటి సంతకాల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో నిరసనకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.