విజయవాడ: దసరా నవరాత్రులలో 4వ రోజు కాత్యాయనీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ వేదపండితులతో కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.