WG: గ్రామాలకు మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏ పార్టీలో గెలిచినా సర్పంచ్లను గౌరవిస్తున్నామన్నారు. రానున్న మూడేళ్లలో రోడ్లు, డ్రెయినేజీలు పూర్తి చేస్తామన్నారు. విద్య, విద్యుత్, హౌసింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు.