ASR: కొయ్యూరు మండలం పాడి, రత్నంపేట గ్రామాల మధ్యలో కొండవాగుపై బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు శ్రమదానంతో వంతెన వద్ద రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత నిధులతో జేసీబీ వాహనం ఏర్పాటు చేసి వాగుపై బాట ఏర్పాటు చేసుకుంటున్నారు. పాత వాగుపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.