NDL: బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో పెద్దమ్మ జాతర గ్రామస్తులు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యాగంటి పల్లె గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆవుకు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి పెద్దమ్మ దేవర ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.