ASR: హుకుంపేట మండలం ములియపుట్టు సచివాలయాన్ని ఆర్డీవో లోకేశ్వరరావు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సందర్శించారు. రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.