KDP: పన్నుల చెల్లింపుపై బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి కీలక ప్రకటన చేశారు. పట్టణ ప్రజలు ఈ నెలాఖరులోపు వడ్డీ లేకుండా పన్ను చెల్లించవచ్చని తెలిపారు. ఆయన పట్టణంలోని వివిధ కాలనీల్లో పర్యటించి పన్ను వసూలు చేశారు. మొండి బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. స్పందించకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.