KKD: ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. బుధవారం సామర్లకోటలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద మధు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలోని ఆస్పత్రులను మెరుగుపరచకుండా, యోగా పేరుతో ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.