ELR: జిల్లాలో వేరు వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న 4 ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప కిషోర్ మాట్లాడుతూ.. నిందితుల వద్ద 70 లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాల విశ్లేషణలో జిల్లా పోలీస్ టీమ్ చాలా బాగా పనిచేస్తుందన్నారు. ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.