కృష్ణ: సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి విదితమే. తప్పు చేస్తే ఎంతటి వారినైనా కర్మ వదిలి పెట్టదని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసులు విమర్శించారు. ఇదిలా ఉండగా పేర్ని వ్యక్తిగత సహాయకునిపై కేసు నమోదు కావడం ఒకటైతే, పేర్ని సతీమణి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.