KDP: ఎర్రగుంట్ల మండలం థర్మల్ పవర్ ప్లాంట్లో కదిరివారిపల్లె గ్రామానికి చెందిన సందీప్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి థర్మల్ ప్లాంట్కు చేరుకొని బాధిత కుటంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్లాంట్ అధికారులతో మాట్లాడారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.