ప్రకాశం: సీఎస్.పురం మండలం మిట్టపాలెం గ్రామంలో వేంచేసియున్న నారాయణ స్వామి దేవస్థానములో ఈనెల 17న నారాయణ స్వామి ఆరాధన కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గిరిరాజు నరసింహ బాబు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆరాధన మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు.