అల్లూరి: జలపాతాలు, నదులు, గెడ్డలు, చెరువులు వద్ద విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జీ.మాడుగుల సీఐ లక్ష్మణరావు సూచించారు. ఆదివారం కొత్తపల్లి జలపాతాన్ని శనివారం ఎస్సై సాయిరామ్ పడాల్తో సందర్శించారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. జలపాతాల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.