SKLM: మున్సిపల్ కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న మూడు మస్టర్ పాయింట్ల స్థానంలో 5 మస్టర్ పాయింట్లుగా పెంచడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.