W.G: కొవ్వూరులో డిసెంబర్ 21న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఈ మేళాకు 28 కంపెనీలలో 1,500 ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. జిల్లాలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.