NDL: బనగానపల్లె మండలం ఫతేనగర్ గ్రామంలో మమత అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మమత అనే మహిళ కుటుంబ కలహాలతో ఆదివారం నాడు పేడలో రంగు పసుపు నీళ్లు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.