NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో వైశాఖమాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో ఆదివారం జ్వాలా నరసింహస్వామి యోగా నరసింహుని అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడ వాహనంపై విహరించారు. అంతకుముందు స్వామి అమ్మ వార్లను పంచామృతాలతో అభిషేకించారు. రాత్రి స్వామి హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.