ప్రకాశం: ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ ఏఅర్ దామోదర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.